కాన్కూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సు

జైపూర్ నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువనేత పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. కాన్కూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడుగుల సాగర్, మల్లేష్, వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి సుమారు 100 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరినీ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువనేత గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నూతన కార్యకర్తలకు,నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,తరతరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి సైన్యాన్ని పెంచుకుంటూ మళ్ళీ బలోపేతం అవుతుందని, ప్రజలు పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అందరిని ఆదరిస్తుందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీతో ఘన విజయాన్ని అందించాలని కోరారు. అలాగే నూతనంగా పార్టీలోకి చేరిన నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా తమ సాయ శక్తుల కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడుగుల సాగర్, మల్లేష్, వెంకటేశ్వర్ గౌడ్ మరియు నూతన కార్యకర్తలు, నాయకులు ,గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version