#మృతుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి.
నల్లబెల్లి, నేటి ధాత్రి: గత కొద్ది రోజుల క్రితం మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్దూరి కొమురయ్య అనారోగ్యంతో మృతిచెందగా శనివారం ఆయన దశదిన కర్మకు మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి హాజరై మృతుని చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయన వెంట పిఎసిఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కేర్ల శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, క్లస్టర్ ఇన్చార్జిమామిండ్ల చిన్న మోహన్ రెడ్డి, ఎంపీటీసీ అజ్మీర లక్ష్మీ సౌమ్య, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కొండోజువెంకటేశ్వర్లు, సొసైటీ డైరెక్టర్ చల్లా యాదగిరి, మాజీ ఎంపిటిసి కూసలింగారెడ్డి, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు దురిశెట్టి శ్రీధర్, నాయకులు తాటికాయల సూరయ్య, కక్కెర్ల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.