చిట్యాల, నేటి ధాత్రి :
దారి గుంట వెళుతున్న భార్యాభర్తలు ప్రమాదశాత్తు ద్విచక్ర వాహనం ఢీకొనగా కిందపడి స్పృహ కోల్పోవడంతో విధి నిర్వహణలో వెళుతున్న చిట్యాల సిఐ వేణు చందర్ తమ వెహికల్స్ ఆపి హాస్పిటల్ తరలించారు.
వివరాల్లోకి వెళితే .చిట్యాల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో వివాహితులు చిట్యాల నుండి తమ అవసరాలు చూసుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ఢీకొట్టడంతో స్పృహ కోల్పోయారు అదే సమయంలో విధి నిర్వహణలో వెళ్తున్న తమ వెహికల్ ని ఆపి తన సిబ్బందితో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సకాలంలో స్పందించిన సీఐ వేణు చందర్ గారిని మండలంలోని ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.