పిల్లలు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలి

చర్చి గురువు.రెవ. యం.కనక రత్నం

సి.ఎస్.ఐ చర్చిలో విబిఎస్ క్లాసులు ప్రారంభం

భూపాలపల్లి నేటిధాత్రి

పిల్లలు భక్తితో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సి ఎస్ ఐ గురువు రెవరెండ్ ఎం. కనకరత్నం అన్నారు. గురువారం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిఎస్ఐ చర్చిలో వేసవికాలం సెలవుల్లో పిల్లలు బయట తిరగకుండా వెకేషన్ బైబిల్ స్కూల్ (విబిఎస్) క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లాసులు 25 నుండి మే 1 వరకు వారం రోజులపాటు జరుగుతాయని తెలిపారు. వివిధ అంశాలతో పిల్లలకి భక్తి, సామాజిక బాధ్యత లు నేర్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి గాను భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర.హరీష్ రెడ్డి సుమారు 150 మంది పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో చర్చి గురువు.రెవ. యం.కనక రత్నం అయ్యగారు, సంకీర్తన అమ్మ, సెక్రెటరీ డి.మొగిలి,యూత్ సెక్రెటరీ జి. ప్రేమ్, గంగమని విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version