గాదరి కిషోర్ కుమార్ గారికి పాలాభిషేకం చేసిన చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు గారు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి

అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామంలో ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ప్రత్యేక చొరవతో ఆర్.అండ్.బి రోడ్ 2,90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు మరియు కల్వర్టుల 1.20 లక్షల రూపాయలతో మంజూరు చెహించారు. రాష్ట్ర ఆర్.అండ్.బి ఇ.ఆన్.సి అధికారులతో స్వయంగా ఎమ్మెల్యే గారు వారితో మాట్లాడి అధికారితో పర్యవేక్షణ చెహించి అదనపు నిధుల కింద 5.42 లక్షలు మంజూరు చెహించారు. 1.20 లక్షలు ఉన్న కల్వర్ట్లను అదనంగా రెండు కల్వర్టులను పెంచి 1.69 లక్షలుగా పెంచారు మొత్తం 7.11 లక్షలు మంజూరు చేశారు ప్రత్యేకమైన చొరవతో రాష్ట్ర అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించడం గ్రామ లక్ష్మీదేవికాలువ గ్రామ ప్రజలు ఒక వరంగా భావించి వచ్చే ఎలక్షన్లో ఓట్ల రూపంలో వారి రుణం తీర్చుకుంటామని చెబుతూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ఈ రోడ్డును వేయించడం అనేది రెండు గ్రామాల ప్రజలకు,రైతులకు వరంగా మారుతుందని ఆయన అన్నారు. ఈ రోడ్డుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని వారు అన్నారు మండలంలో ఉండబడిన ఏకైక ఆర్ అండ్ బి రోడ్డుగా ఉంది గతంలో ఉన్న రోడ్డుతో రెండు గ్రామాల ప్రజలు బాధలు గురైనారు అని అన్నారు. కాబట్టి దీన్ని వెడల్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎమ్మెల్యే గారికి లక్ష్మీదేవికాలువ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయశారు. ఈకార్యక్రమంలో లక్ష్మీదేవికాలువ గ్రామ ఎంపీటీసీ చిగుళ్ల ఉపేంద్ర రమేష్ గారు మాజీ సర్పంచ్ పొన్నాల చంద్రకళ గారు గ్రామశాఖ అధ్యక్షులు మారోజు వెంకన్న గారు నక్క అబ్బయ్య, చిగ్గుల వీరయ్య, బొమ్మగాని నాగయ్య, చెరుకు మధు, పనుమటి బిక్ష్మయ్య, కొలుగురి రాములు, కంచనపల్లి గీత, మారోజు శైలజ,లక్ష్మీదేవికాల్వ గ్రామ ప్రజలు యువ నాయకులు అధిక సంఖ్యలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version