ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

గొల్లపల్లి నేటి ధాత్రి:

జగిత్యాల జిల్లా గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ అగ్రనేత జన నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం పేద ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం భారత్ జోడో యాత్ర ప్రారంభించి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపించిన యువ నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు భీమ సంతోష్, చిర్రా గంగాధర్, రేవెల్ల సత్యనారాయణ గౌడ్, రాజారావు, దాసరి తిరుపతి గౌడ్, కొండ వెంకటేష్ గౌడ్, పురపాటి రాజు రెడ్డి, కస్తూరి హరి కిరణ్, రామ్మోహనరెడ్డి, దేవురకొండ శ్యామ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఓరగంటి తిరుపతి, పట్టణ అధ్యక్షులు నేరెళ్ల మహేష్, బీసీ సెల్ అధ్యక్షులు కాసా గంగాధర్, రేవెల్ల లింగయ్య, సుద్దాల శేఖర్, చెవుల మద్ది రమేష్, సతీష్ గౌడ్, మాజు లక్ష్మణ్ రావు, గోపి, మారం కుమార్, కంది వెంకటేష్, గంగాధర మధుసూదన్, గడప రవి, రామడుగు తిరుపతి, దూడ నరేష్ నాయకులు కార్యకర్తలు యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version