సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల తెలంగాణ భవన్ లో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య,జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఈసందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ
దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నర్సింహారావు అని తెలంగాణ రాష్ట్రంలోని మన కరీంనగర్ ముద్దుబిడ్డ కావడం గర్వకారణమన్నారు. బహుభాషా కోవిదుడు, జాతీయవాది, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని వారు కొనియాడుతూ భూసంస్కరణలలో భాగంగా పేదలకు తన భూమిని పంచిన గొప్ప సంస్కర్త పీవీ అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, భావితరాలకు స్ఫూర్తిగా అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో
సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ టెక్స్ట్ టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందము కళ చక్రపాణి, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కుంబాల మల్లారెడ్డి,ఎంపీపీ పడిగెల మానస రాజు, మాట్ల మధు,గజభింకార్ రాజన్న,సురేష్ నాయక్,సికిందర్,కందుకూరి రామగౌడ్,కంచర్ల రవి,శ్రీనివాస్,వెంకటేష్,సందీప్,ధనుష్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
