జమ్మికుంట: నేటిధాత్రి
జమ్మికుంట పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం పదిమంది భవాని మాల భక్తులు మాలలు ధరించి, పురోహితులచే అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భవాని మాలధారణ భక్తులు ఆకుల రాజేందర్, ముధం తిరుపతి, మోహన్, ఆకుల ఐలేష్, రామన్న, సంపత్, కైలాసకోటి గణేష్, మారుమూల శ్రీనివాస్, దార కృష్ణ, కట్కోజుల హరికృష్ణ , ఆకుల గణేష్ మాల ధరించగా ఇట్టి కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఆకుల మహేందర్, మాగంటి భాస్కర్ , పూరెల్ల తిరుపతి, చదువు కిరణ్ కుమార్ రెడ్డి, గోపగాని హరీష్, గుర్రపు శ్రీకాంత్, రాజు మరియు అనేక మంది మహిళా భక్తులు పాల్గొన్నారు.
