కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో కరోనా కలకలం-శుక్రవారం పరీక్ష వాయిదా

నేటిదాత్ర కేయూ:
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు జులై 5వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ హాస్టల్లో దాదాపు 200 మంది విద్యార్థులు వసతి తీసుకొని పరీక్షలు రాస్తున్నారు, వారిలో ఒకరు అస్వస్థతకు గురి కాగా, టెస్ట్ చేస్తే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కోవిద్ పాజిటివ్ వచ్చిన విద్యార్థిని ఇంటికి పంపించి, హాస్టల్ డైరెక్టర్ మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు అందరూ పరీక్షలను పోస్ట్పోన్ చేయాల్సిందిగా అధికారులను కోరగా శుక్రవారం జరగబోయే బీటెక్ మూడవ సంవత్సరం మొదటి సెమిస్టర్ మూడో పేపర్ పరీక్ష వాయిదా వేశారు. మిగతా పరీక్షలను సోమవారం నుండి యధావిధిగా కొనసాగించబడ్డాయనీ వాయిదా వేసిన పరీక్షను ఎప్పుడు నిర్వహించేది తర్వాత షెడ్యూల్ చేస్తామని పరీక్షల నియంత్రణ అధికారి మరియు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య మల్లారెడ్డి అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సురేఖ తెలిపారు. రోజు పరీక్ష ప్రాంగణములో మరియు వసతిగృహాలలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయాలని, బీటెక్ పరీక్షలను ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో నిర్వహించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. గత మూడు రోజుల క్రితం జెఎన్టి యు మరియు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పరీక్షలను వాయిదా వేయాలని ఆన్లైన్లో బీటెక్ డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరడం జరిగింది.
ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, జాతీయ విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీస్, అటానమస్ కళాశాలలు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు, కానీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఆఫ్లైన్ విధానానికి మొగ్గు చూపడం వలన విద్యార్థులు కరోనా బారినపడి ప్రాణ నష్టం జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని, టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులకు పరీక్షలు ఆన్లైన్లో పెట్టాలని విద్యావేత్తలు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో కరోనా కలకలం

*కేయూ క్యాంపస్, నేటిదాత్రి*
కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ హాస్టల్లో దాదాపు 200 మంది విద్యార్థులు వసతి తీసుకొని పరీక్షలు రాస్తున్నారు, వారిలో ఒకరు అస్వస్థతకు గురి కాగా టెస్ట్ చేస్తే పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కోవిద్ పాజిటివ్ వచ్చిన విద్యార్థిని ఇంటికి పంపించి, హాస్టల్ డైరెక్టర్ మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు అందరూ పరీక్షలను పోస్ట్పోన్ చేయాల్సిందిగా అధికారులను కోరగా వారు నిరాకరించి, పరీక్షలను యధావిధిగా నిర్వహిస్తామన్నారు.

అక్రమంగా నడిపిస్తున్న నారాయణ జూనియర్ కళాశాల సీజ్

అక్రమంగా నడిపిస్తున్న నారాయణ జూనియర్ కళాశాలకు షోకాజ్ నోటిసులు పంపి,కళాశాలను సీజ్ చేసిన డి.ఐ.ఈ.ఒ

నేటి ధాత్రి* హన్మకొండ లోని పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం లో గల భవనం కిరాయికి తీసుకుని అక్రమంగా నారాయణ జూనియర్ కాలేజి పేరుతో నడిపిస్తున్నారు.ఈ కళాశాల పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎబివిపి కార్యకర్తలు వరంగల్ జిల్లా డి.ఐ.ఈ.ఒ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ రోజు నారాయణ జూనియర్ కాలేజి యాజమాన్యం కి షోకాజ్ నోటిసులు జారి చేసారు. వరంగల్ అర్బన్ జిల్లా డి.ఈ.ఓ మరియు డి.ఐ.ఈ.ఓ ఆధ్వర్యంలో కళాశాల ను సీజ్ చేసారు.ఈ సందర్భంగా ఎబివిపి తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేణు మాట్లాడుతూ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎబివిపి చూస్తూ ఉండదు. నిరంతరం విద్యార్థుల సమస్యల పై కృషి చేస్తాం.గత వారం రోజులుగా ఎబివిపి కార్యకర్తలు కార్పొరేట్ కాలేజి అయిన నారాయణ జూనియర్ కాలేజికి ధీటుగా కృషి చేసారు. దాదాపు 100 మంది విద్యార్థుల దగ్గర లక్ష రూపాయల వరకు ఫీజు వసూలు చేసారు. వారి డబ్బుని వారికి తిరిగి చెల్లించాలని నారాయణ కాలేజి యాజమాన్యాన్ని డిమాండ్ చేసారు.విద్యార్థులకి మోసం చేస్తున్న ఇలాంటి కార్పొరేట్ కాలేజి లకి ఇది ఒక హెచ్చరిక.ఇకనైనా డి.ఐ.ఈ.ఓ గారు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని డిమాండ్ చేసారు. కార్యకర్తలు పాషా,బలరాం, శ్రీ హరి పాల్గొన్నారు.

*తహసీల్ కు లంచంగా తాలిబోట్టు*

రాజన్న సిరిసిల్ల జిల్లా / *నేటి ధాత్రి*

*తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని మహిళ నిరసన*

రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం మంగ కు చెందిన సర్వే నెంబర్ 130/14 లో గలా 2 ఎకరాల భూమిని తన భర్త రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోగానే వేరే వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టా చేసరని న భూమి నాకు పట్టా చేయాలని మూడు సంవత్సరాలుగా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని
ఈ రోజు తన భర్త ఎలాగో లేడు అని తన తాళిబొట్టు తీసి ఆఫీస్ గెట్ కి వేలాడదీసి ఇ తాళిబొట్టును లంచంగా తీసుకొని న భూమి నాకు పట్టా చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.బాధిత మహిళ ఉద్యోగ రీత్యా మెటపల్లి లో పని చేసుకుంటూ ఉండగా వేరే వళ్లు తన భూమిని మొక ఎంక్వైరీ చెపిచ్చుకొని పట్టి చేసుకున్నారని దానికి అధికారులు కూడా సహకరించారని ఆవేదన వ్యక్తం చేసింది తనకు భర్త లేడాని కనీసం తనకు ఆధారమైన ఇట్టి భూమినైన ఇప్పించాలని అధికారులను వేడుకుంటుంది……

*మంత్రి హరీష్ రావు కారుకు ప్రమాదం*

నేటి ధాత్రి  సిద్దిపేట జిల్లా

మంత్రి హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం
సిద్దిపేట నుండి మంత్రి హరీష్ రావు హైదరాబాద్ వెళ్తుండగా..హరీష్ రావు కాన్వాయి ముందు వెళ్తున్న కారుకు అడ్డు వచ్చిన అడవి పందులు ముందు కారు వ్యక్తి సడెన్ గా బ్రేక్ వేయడం తో ఆకారు వెనుక భాగం లో ఢీకొన్న హరీష్ రావు పైలెట్ కారు…పైలెట్ కారును ఢీకొన్న మంత్రి హరీష్ రావు కారు…ముందు కారులోని వ్యక్తికి స్వల్పగాయాలు..

గాయాలయిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించి మరోకారులో హైద్రాబాద్ వెళ్లిన హరీష్ రావు..
కారు ముందు భాగం కొంత ధ్వంసం..
కొండపాక మండలం బంధారం దర్గా కమాన్ సమీపంలో ఘటన..

 

సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్.

*నేటి ధాత్రి హైదరాబాద్* ఫ్లాష్.. ఫ్లాష్..
సీఎం కేసీఆర్ కరోనా పాజిటివ్.

స్వల్ప లక్షణాలతో తన ఫాం హౌస్ లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కుమార్ ప్రకటించారు.

గుత్తేదారులు గుప్పిట్లో గురుకులాలు

వాస్తవ కథనాలను వెలుగులోకి తెస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలకు మారుపేరుగా మారిన నేటిధాత్రి
” గుత్తేదారులు గుప్పిట్లో గురుకులాలు “” అనే వాస్తవ కథనాన్ని వరుస కథనాలతో ప్రచురణ చేస్తున్న నేటిధాత్రి దినపత్రికను ఇతర పత్రికలు ఆదర్శంగా తీసుకోవాలని తెలుపుతూ నేటి ధాత్రి దినపత్రికకు కృతజ్ఞతలు తెలుపతున్న పిర్యాదుదారుడు.

ఉత్తమ అవార్డు అందుకున్న డాక్టర్ మాలకొండయ్య

జోగులాంబ గద్వాల్ జిల్లా, నేటిధాత్రి: అలంపూర్ నియోజక వర్గం రాజోలి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ మాలకొండయ్య ఉత్తమ వైద్యుడిగా అవార్డు ను జిల్లా కలెక్టర్ శృతి ఓజా చేతుల మీదుగా జిల్లా కేంద్రం లోని గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డు ను అందుకున్నారు. డాక్టర్ మాలకొండయ్య కు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, రోగుల పట్ల అంకితభావం తో పనిచేసి ప్రజల మధ్య నే ఉంటూ వైద్య ఆరోగ్య సేవలు అంించేందుకు ఎంతో కృషి చేశారని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయ్ స్ యూనియన్ జోగుళాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాష్ ప్రశంసించారు. డి పి ఎమ్ ఓ. మల్లికార్జున, మెడికల్ ఆఫీసర్ లు జ్యోత్స్న దేవి, జయమ్మ, రంజిత్ కుమార్, ఉలిగెమ్మ, ఏ ఎన్ ఎమ్ లు ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేశారు

*రైతులు మారుతున్న సమయానుగుణంగా మారాలి గండ్ర*

*పామాయిల్ సాగు పరిశీలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు*

*వేగవంతంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి*

*విద్యుత్ తాగునీటి సరఫరా శాఖలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సర్పంచులు*

*అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి గండ్ర*

*మత్స్య శాఖ ఉన్నత అధికారులు రాకపోవడంతో ఆగ్రహం*

*సమావేశంకు హాజరు కాని మైనింగ్ ఎక్సైజ్ ఆర్ అండ్ బి పలు శాఖల అధికారులు*

*చలి వాగు నీటిని విడుదల చేసిన దంపతులు*

శాయంపేట, నేటిధాత్రి: రైతులు మారుతున్న నవయుగానికి అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న లాభసాటి పంటలు
వేసి సమానంగా మారాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని మండల మహిళ సురేఖ సమైక్య కార్యాలయంలోని సమీక్ష సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి సభాధ్యక్షత వహించగా వ్యవసాయ, ఉద్యానవన, విద్య, పశు సంవర్ధక, ప్రజారోగ్యం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఇందిరా క్రాంతి, సాంఘిక సంక్షేమ, శిశు సంక్షేమ, పౌరసరఫరా, నీటిపారుదల ఆర్డబ్ల్యూఎస్,
విద్యుత్, మత్స్యశాఖ, ఈజీఎస్ శాఖల వారీగా సమీక్షించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మైనింగ్ ఎక్సైజ్ ఆర్ అండ్ బి పలు శాఖల అధికారులు సమావేశానికి హాజరు కాలేదు దీంతో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఎంపీడీవో
కృష్ణమూర్తికి ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఆహారపదార్థాల్లో ప్రజలు నిత్యం వినియోగించే నూనె ఉత్పత్తులను ఇతర దేశాల నుండి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నామని దీన్ని నివారించడానికి రైతులకు లాభాలు చేకూర్చాలని ప్రభుత్వం రాయితీలు కల్పిస్తూ పామ్ ఆయిల్ ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో ప్రోత్సాహకాలు అందజేస్తోందని రైతులు పామాయిల్ సాగు చేసి లాభాలు పొందాలని అన్నారు. పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలో పామాయిల్ సాగు చేసి రైతులు లాభాలు అర్జీఇస్తున్నారని, పామాయిల్ సాగు పరిశీలించడానికి భూపాలపల్లి నియోజకవర్గంలో పామాయిల్ సాగు పై ఆసక్తి ఉన్న రైతులు సాగును పరిశీలించడానికి త్వరలోనే రైతులతో పర్యటన చేపట్టనున్నట్లు ఆసక్తి ఉన్న రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. శాయంపేట
మండల కేంద్రానికి డబుల్ రోడ్డు పాలనాపరంగా అనుమతులు తీసుకుని మంజూరు అయిందని ఫిబ్రవరి మాసంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని పనులు ప్రారంభిస్తారని, ఆరేపల్లి రోడ్డు పనులు కూడా పూర్తి చేపడతామని ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులు సహకరించాలని ఇల్లు కోల్పోయిన వారికి ఇండ్లు కట్టిస్తామని, బాధితులు ముందే మంజూరు కాపీని అందజేయమనడం సరికాదని, శాయంపేట మండల కేంద్రంలో 110 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టి ఇండ్లు కోల్పోయిన వారికి నిరుపేదలకు అందజేయడానికి అందరూ సహకరించి పనులు చేపట్టాలని అన్నారు.

*వేగవంతంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి*

శాయంపేట మండలానికి 455 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా వాటి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని గండ్ర దంపతులు సూచించారు. సాంక్షన్ అయిన గ్రామాలలో స్థలాన్ని పరిశీలించి ఈ మధ్య కాలంలోనే భూమి పూజ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. శాయంపేట మండల కేంద్రంలో
నల్లకుంట చెరువు శిఖం భూమి ఉందని అధికారులు తెలపగా, అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి స్థలాన్ని పరిశీలించి భూమిని చదును చేయించి ఆరో తేదీన ఫౌండేషన్ వేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.

*భూమి ఇవ్వమని సాగుచేస్తున్న బాధితుల నిరసన*

నిరుపేదల మైన మేము చెరువు శిఖం భూమిని సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని ఆ భూమిని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఇవ్వబోమని సాగుచేస్తున్న బాధితులు సమావేశం అనంతరం గండ్ర దంపతుల దృష్టికి తీసుకు వచ్చారు. తాము సాగుచేసుకుంటున్న భూమిని ఇవ్వమని మరిఇతర ఏదైనా భూమిని పరిశీలించి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ తమ గోడును గండ్ర దంపతుల దృష్టికి తీసుకువెళ్లారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పైసోపర్కో చెల్లించి లాక్కున్న భూములు చాలా ఉన్నాయని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న కే పేదలు సాగు చేస్తున్న ఈ భూమిలోకి రావాలని బాధితులు అనడం గండ్ర దంపతులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో విషయం చేయి దాటకుండా పోలీస్ బందోబస్తు చేసిన శాయంపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

*విద్యుత్ తాగునీటి సరఫరా శాఖలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సర్పంచులు*

రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా విద్యుత్ తాగునీటి సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్న క్షేత్రస్థాయిలో
విద్యుత్ నీటి సరఫరా శాఖల అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ కోతలు లీకేజీలతో సరైన నీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచులు సభాముఖంగా అధికారులను నిలదీశారు. విద్యుత్ శాఖ అధికారులు ఆ కారణంగా కోతలు విధిస్తున్నారని వ్యవసాయ క్షేత్రాలలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని ఏఈ అందుబాటులోకి రాడని పెద్దకొడపాక సర్పంచ్ అబూ ప్రకాష్ రెడ్డి అన్నారు. గట్లకనీపర్తి సూరంపేట గోవిందాపూర్ కొప్పుల గ్రామాలలో మిషన్ భగీరథ నీరు ట్యాంక్ లోకి ఎక్కడం లేదని సర్పంచులు రజిత, శ్రీనివాస్, సాంబయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్ సభ దృష్టికి తీసుకువెళ్లగా ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీటిని చేరవేయడానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ పనులు చేపట్టినప్పటికీ తాగునీటిని ఎందుకు సరఫరా చేయడం లేదని సమస్యను అతి త్వరగా పరిష్కరించాలని, వచ్చేది వేసవికాలంలో నీటి విద్యుత్ కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.

*మత్స్య శాఖ ఉన్నత అధికారులు రాకపోవడంతో ఆగ్రహం*

మత్స్య సంపద పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని మత్స్య శాఖలో ఉన్న అవకాశాలను చేప పిల్లల పంపిణీ ఇతర విషయాలపై ఆరోపణలు వచ్చినా మత్స్యశాఖ అధికారులు తెలియజేయడం లేదని శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి సభ దృష్టికి తీసుకువెళ్లగా, మత్స్య సంపదను పెంచి ప్రజలకు పౌష్టికాహారాన్ని అందజేయాలని ప్రభుత్వం మత్స్య శాఖలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మత్స్య సంపద పెంపొందించడానికి కృషి చేస్తుంటే మూడు మాసాలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశంలో పథకాలు వివరించడానికి మత్స్య శాఖ అధికారులకు సమావేశానికి వచ్చే అంత సమయం లేదా అని గండ్ర వెంకటరమణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చరవాణి ద్వారా మత్స్యశాఖ ఉన్నత అధికారులను ఆరా తీశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని మత్స్య శాఖలో వస్తున్న ఆరోపణలు ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు వివరించే విధంగా సర్పంచులకు తెలియజేయాలని సూచించారు.

*చలి వాగు నీటిని విడుదల చేసిన దంపతులు*

యాసంగి పంట సాగుకు గానూ చలి వాగు ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన దంపతులు. శాయంపేట నుండి చిట్యాల వరకు సాగునీరు
అందజేస్తూ తాగునీరు కూడా సమకూరుస్తున్న చలి వాగు ప్రాజెక్టు ఆధునీకరణ అభివృద్ధికి తొమ్మిది కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు.

*అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో బంద్*

*బంద్ కు మద్దతుగా ధర్నా రాస్తారోకో*

*సన్న వడ్లకు 25 వందల మద్దతు ధర కల్పించాలని డిమాండ్*

శాయంపేట, నేటిధాత్రి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ధర్నాకు మద్దతుగా రైతు సంఘాలు అఖిలపక్షం నాయకులు ఇచ్చిన పిలుపు మద్దతుగా శాయంపేట మండలంలో ఎంసిపిఐ యు, కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్,తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, ఎమ్మార్పీఎస్, బహుజన సంక్షేమ సంఘం, డివైఎఫ్ఐ రైతు సంఘాలు అఖిలపక్ష నాయకులు బంద్కు మద్దతు తెలుపుతూ ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. శాయంపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి మందారపేట జాతీయ రహదారిపై ధర్నా
రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రము ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు పార్లమెంట్లో ఆమోదించినప్పుడు వ్యతిరేకించకుండా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం అంటూ ద్వంద వైఖరి టిఆర్ఎస్ నాయకులు ఆల్ అందిస్తున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మండల నాయకులు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతులు సన్నరకం ధాన్యం వేయాలని చెప్పి వేసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని రైతులను మోసం చేసి నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల భాస్కర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు, అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ చేపట్టిన రైతు న్యాయ పోరాటం చేస్తున్న రైతులకు న్యాయం జరిగే వరకు
బహుజన సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు
తెలుపుతున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు మారెపల్లి క్రాంతికుమార్ తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉప సంహరించుకునే వరకు రైతుల పక్షాన నిలిచి పోరాటం చేస్తామని తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి వంగరి సాంబయ్య అన్నారు.

*సన్న వడ్లకు 25 వందల మద్దతు ధర కల్పించాలని డిమాండ్*

రాష్ట్రంలో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని వ్యవసాయ
శాఖ అధికారులు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రచారం చేయించిన
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన
సన్న రకం ధాన్యానికి 2500 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేపట్టాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న అన్ని వర్గాల నాయకులకు
ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ యు నాయకులు హుస్సేన్, పరికరాల భూమయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దేవయ్య, ఏఐఎఫ్బి మండల నాయకులు చిందం రవి, నిమ్మల రమేష్, శ్రీను, రాజ్ కుమార్, రవీందర్, జగన్, సతీష్, బహుజన సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మగ్గం సుమన్, కార్యదర్శి మనోజ్,డివైఎఫ్ఐ అధ్యక్షులు మంద సురేష్,
అఖిలపక్ష నాయకులు రైతులు పాల్గొన్నారు.

ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పిస్తాం 

గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి

జిడబ్ల్యూ ఎంసి,నేటిధాత్రి:  ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పించుటకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కుడా కార్యాలయంలో అధికారులతొ సమావేశమై ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు  భిక్షాటన ను వీడి సమాజంలో గౌరవంగా జీవించాలనే సదుద్దేశంతో వారికి బల్దియా ద్వారా కమ్మునిటీ టాయిలెట్స్, లూ కేఫ్ లు, నర్సరీలు నిర్వహణ బాధ్యతలు అప్పగించమని అన్నారు. విద్యార్హత, వృత్తి నైపుణ్యాలను బట్టి వారికి ప్రత్యామ్నాయంగా మరిన్ని అవకాశాలు,జీవనోపాధి కల్పించాలని అన్నారు.
కొందరు ట్రాన్స్ జెండర్బీలు ఉన్నత విద్యానభ్యసించి ఉన్నారని, ఆర్ ఎం పీ చేసియున్నారని, వారికి జెన్రిక్ ఔషధాల దుకాణం ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించాలని అన్నారు. అందుకు గాను త్రినగరిలో జెన్రిక్ ఔషధాల దుకాణం ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజా రెడ్డి ను ఆదేశించారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ద్వారా నగరంలో నిర్వహిస్తున్న
జెన్రిక్ మెడికల్ షాప్ గురించి ఈ వి శ్రీనివాస్ వివరించారు.ఈ కార్యక్రమంలో సిఎంహెచ్ ఓ డాక్టర్ రాజీ రెడ్డి, కార్యదర్శి విజయలక్ష్మి, యూ ఎం సి, పి ఓ వెంకట రమణి, రెడ్ క్రాస్ బాధ్యులు ఈ వి శ్రీనివాస్, అడేపు సూరేష్, ట్రాన్స్ జెండర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్వో కు ఓటర్ నమోదు ఫారంలు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు..

మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా),
06 నవంబర్ (నేటిధాత్రి):

టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలో
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నమోదు చేయించిన
పట్టభద్రుల ఓటర్ ఫారంలను శుక్రవారం చివరి తేది కావడంతో 1000 పట్టభద్రుల ఓటర్ నమోదు ఫారంలను మల్కాజ్గిరి తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సరితకు అందజేశారు, ఈ కార్యక్రమంలో మునుస్వామి,మైత్రినాథ్, బిక్షపతి,గణేష్ ముదిరాజ్, పివి సత్యనారాయణ, కిట్టు, కన్నా, బైరు అనిల్, వెంకట్, జగపతి, తదితరులు పాల్గొన్నారు.

తహసిల్దార్ ను కలిసిన ప్రజాప్రతినిధులు, నాయకులు

 ఐనవోలు నేటిధాత్రి : మండలానికి తహసీల్దార్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ ను మండల ఎంపీటీసీలు మర్యాద పూర్వకంగా కలిసి,పుష్ప గుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, మండల పార్టీ అధ్యక్షులు పోలేపెల్లి శంకర్ రెడ్డి, ఎంపీటీసీ లు కొత్తూరి కల్పన మధుకర్, చాట్ల అరుణ,తాటికాయల రమేష్, రాజేందర్,సోమేశ్వర్,దామెర అనూష అనిల్ తదితరులు ఉన్నారు.

రాష్ట్ర అభ్యున్నతిలో హరితహారం కీలకం -మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా,నేటిధాత్రి: రాష్ట్ర అభ్యున్నతిలో హరితహారం కీలకంగా మారుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం 6వ విడత హరిత హారంలో భాగంగా జిల్లాలోని బయ్యారం లో అవెన్యూ ప్లాంటేషన్, చర్లపల్లి మంకీ ఫుడ్ కోర్టులో మొక్కలు నాటారు.
అనంతరం బయ్యారంలో పి. ఏ. సి.ఎస్ ఆధ్వర్యంలో కోటి రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతూ బిందు, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, పి. ఏ.సి.ఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, కలెక్టర్ వి.పి గౌతమ్, స్థానిక నేతలు అధికారులు పాల్గొన్నారు .

తెలంగాణలో రికార్డు బ్రేక్

ఒకే రోజు 199 కరోనా కేసులు నమోదు
-జీహెచ్ఎంసీలో మోగుతున్న కరోనా ప్రమాద గంటికలు
-24 గంటల్లో 5 గురి మృతి
రాష్ట్రంలో 2,698కి చేరిన కేసులు
-రాష్ట్రంలో కర్ఫ్యూ భారీ సడలింపు

హైదరాబాద్: తెలంగాణలో అమాంతం రికార్డు బద్దలు కొట్టే కేసులు నమోదయ్యాయి.ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులేటిన్ ప్రకారం కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఒక్కరోజే 122 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాజధాని ప్రాంతంలో కరోనా ప్రమాద గంటికలు మరింత అధికమయ్యాయి. రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 10, ఖమ్మంలో 9, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, మెదక్‌లో 3 చొప్పున కరోనా కేసులు నమోదు కాగా వరంగల్‌ అర్బన్‌లో 2, సూర్యాపేట, నిర్మల్‌, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు నమోదు అయింది. కొత్తగా ముగ్గురు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ 2,698 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 1428 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 1,188 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఈ రోజు కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 82 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.

రెండు రోజుల్లో ధాన్యం మొత్తాన్ని తరలించాలి ఆర్డివో కిషన్

*20 లారీలు ఏర్పాటు చేస్తాం*

*ఆర్డిఓ విచారణలో బయట పడుతున్న నిజాలు*

*ధాన్యం విక్రయించి నెల గడిచినా అందని రిసిప్ట్*

*ధాన్యం నిల్వ చేయడానికి గోదాం పరిశీలన*

శాయంపేట, నేటి ధాత్రి: రెండు రోజులలో మక్కల కొనుగోలు ప్రక్రియ ముగియనున్నది, వేల సంఖ్యలో బస్తాలు గోదాములకు తరలించకుండా నిల్వ ఎందుకు చేశారు, రెండు రోజుల్లో ధాన్యం మొత్తాన్ని గోదాములకు తరలించాలని ఆదేశాలు జారీ చేసిన పరకాల ఆడివో కిషన్ నాయక్. శాయంపేట మండలంలో పెద్ద మొత్తంలో మక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిలిచిపోయింది, శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం వర్షానికి తెలిసింది. విషయం తెలుసుకున్న పరకాల ఆడివో కిషన్ నాయక్ శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 20 రోజులు గడిచిన మక్కలు కాంటాలు వేయడం లేదని, కాంటాలు వేసి 20 రోజులు గడిచిన గోదాములకు తరలించడం లేదని, లోడ్ అన్లోడ్ అయ్యేవరకు బాధ్యతలు రైతు ఏఅని తరలించడానికి బస్తాకు మొదలు10 20 నుండి ఇవాళ 50 రూపాయలు ఆడుతున్నారని రైతులు ఆర్డీఓ దృష్టికి తీసుకు వచ్చారు. నిర్లక్ష్యానికి కారణమేమిటని తెలుసుకోవడానికి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఎవరు అని అడుగగా కొనుగోలు కేంద్రంలో ఎవరూ లేకపోవడంతో ఇంత నిర్లక్ష్యమా అని అసహనం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి ఆడివో చేరుకున్న విషయం తెలుసుకున్న పిఎసిఎస్ చైర్మన్ శరత్ కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు, నిర్లక్ష్యానికి కారణమేమిటని ఆడివో ఆరా తీశారు వేలది బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో పేరుకుపోతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని విచారణ చేపట్టగా, ట్రాన్స్పోర్ట్ఆర్ కారణంగా వాహనాల కొరత ఉందని తెలుపగా, ట్రాన్స్పోర్ట్ వాహనాలు, సమస్యలు ఏవైనా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మీదేనని తెలియదా. వర్షం వస్తే ఎంత నష్టం వాటిల్లుతుంది ఇంత నిర్లక్ష్యం వహించినందుకు వచ్చేసారి మీకు కొనుగోలు కేంద్రం అలాట్మెంట్ చేయమని హెచ్చరించారు. పెద్ద రైతులు పలుకుబడి ఉన్న వారు ధాన్యాన్ని తీసుకు వచ్చి లారీలు పెట్టుకుంటే టోకెన్ ప్రకారం కాకుండా వారి ముందు తరలించడం కారణంగా సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుందని ఎవరు వాహనం పెట్టుకున్న టోకెన్ ప్రకారం ముందు కాంటాలు వేసిన వారి తరలించాలని, హమాలీలతో మాట్లాడారు లారీలను మేము ఏర్పాటు చేస్తాం రెండు రోజులలో ధాన్యం మొత్తాన్ని లైట్లు ఏర్పాటు చేసి డే అండ్ నైట్ పని చేసి గోదాములకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

*20 లారీలు ఏర్పాటు చేస్తాం*

దాన్యం కొనుగోలు కేంద్రంలో ఎన్ని బస్తాలు పేరుకుపోయి ఉన్నాయని ఆడివో చైర్మన్ వివరణ కోరగా 11 వేల పైచిలుకు కాంటాలు హై ఈ కేంద్రంలో నిల్వ ఉన్నాయని అనగా,లారీకి 550 బస్తాల చొప్పున 20 లారీలను ఏర్పాటు చేస్తాం, శాయంపేట తహసిల్దార్ హరికృష్ణ ఇన్చార్జిగా వ్యవహరిస్తారు రెవిన్యూ సిబ్బంది సహాయంతో ధాన్యాన్ని వేగవంతంగా తరలించడానికి ప్రయత్నాలు చేయాలని సూచించారు.

*ఆర్డిఓ విచారణలో బయట పడుతున్న నిజాలు*

శాయంపేట మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో విచారణ చేపట్టడానికి వచ్చిన పరకాల ఆడివో కిషన్ నాయక్ కు రైతులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు జరుగుతున్న అవకతవకలను తెలియజేసారు, పైరవి కారులాయి పలుకుబడి ఉన్నవారి పెత్తనం కొనసాగుతుందని,కొనుగోలు కేంద్రానికి ముందు ధాన్యం తీసుకువచ్చిన వారి ధాన్యాన్ని ముందు తరలిస్తున్నారని, ఒక టోకెన్ పేరుమీద నలుగురైదుగురు పైరవి కారులకు ఉపయోగిస్తున్నట్లు ఆడివో దృష్టికి తీసుకువచ్చారు.

*ధాన్యం విక్రయించి నెల గడిచినా అందని రిసిప్ట్*

రైతులు కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యానికి నెల రోజులు గడిచినా రిసిప్ట్ అందజేయడం లేదని రైతులు ఆడివో దృష్టికి తీసుకువెళ్లారు, రైతులు విక్రయించిన దానికి వారికి ఒక రిసిప్ట్ అందజేయాలి కదా మరి ఎందుకు అంత చేయడం లేదని చైర్మన్ను ప్రశ్నించగా బుక్కులు అయిపోయాయని మార్క్ఫెడ్ వారు కూడా అందజేయడం లేదని తెలుపగా, ఆడివో వెంటనే మార్క్ఫెడ్ డీఎంకు ఫోన్ చేసి రైతులు విక్రయించి గోదాములకు తరలించిన మక్కలకు బుక్కులు లేక రిసిప్ట్ అందజేయడం లేదని తెలుపగా, బుక్కులు ఎన్ని కావాలంటే అన్ని అందుబాటులో ఉన్నాయని అనడంతో పిఎసిఎస్ బాగోతం బయటపడింది. ఇది గ్రహించిన ఆడివో మరికొన్ని సెంటర్లు విజిట్ చేసి శాయంపేట విఆర్ఓ రామకృష్ణను పంపిస్తాను సెంటర్ కు 5 బుక్కుల చొప్పున అందజేయగలరు అని కోరారు.

*ధాన్యం నిల్వ చేయడానికి గోదాం పరిశీలన*

రైతులు పండించిన ధాన్యం నిల్వ చేయడానికి శాయంపేట మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్, ఆరేపల్లి గ్రామంలో నిర్మించిన గోదాములలో, ధాన్యం నిల్వ చేసే అంశాలపై ఆడివో పరిశీలన చేపట్టారు, పెద్దకొడేపాక గ్రామంలో ఉన్న పాత గోదాము మరమ్మతులు చేపట్టి మక్కలు నిలువ చేసే అంశం సర్పంచ్ ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా మండలంలోని ధాన్యం నిల్వలకు ఉపయోగపడే గోదాములను పరిశీలించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఐనవోలు(వర్ధన్నపేట)నేటిధాత్రి:రైతుల సంక్షేమమే
ప్రభుత్వ లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తున్నదని నందనం పిఏసిఏస్ వైస్ చైర్మన్ తక్కల్లపేల్లి చందర్ రావు అన్నారు.గురువారం మండలంలోని పెరుమాల్లగూడెం గ్రామంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ విధానంలో సంస్కరణలు తెచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పాటు పడుతున్నారని అన్నారు. రైతులందరూ ఒకే రకమైన పంటలు చేయడం వలన డిమాండ్ లేక గిట్టుబాటు ధర లభించడం లేదని చందర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పిడుగు రజిత, ఎఇవో సరేష్ రైతులు పాలొన్నారు

పాత్రికేయుల సేవలు అమూల్యం…!

కరోనా సంక్షోభం నుంచి పాత్రికేయులను కాపాడుకోవాలి

పలువురికి సరుకులు అందించిన టిఆర్ఎస్ యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్

కరోనా వైరస్ యావత్తు మానవాళిని గడగడలాడిస్తున్న నేపథ్యంలో పాత్రికేయుల సేవలు అమూల్యమైనవని టిఆర్ఎస యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్ అన్నారు. బుధవారం హన్మకొండ జడ్పీ గెస్ట్ హౌజ్ ఆవరణలోలో వరంగల్ నగరంలోని పలువురు పాత్రికేయులకు సరుకులు అందించారు.

ఈ సందర్భంగా వీరేందర్ మాట్లాడుతూ…కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో మీడియా రంగంలో పని చేస్తున్న ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను ఆర్థిక సంక్షోభం వెంటాడుతుందని అన్నారు. తమ వంతుగా 20 మంది చిన్న పత్రికలలో పనిచేస్తున్న పాత్రికేయులకు భరోసానివ్వటంలో భాగంగా పలువురికి
నిత్యవసర సరుకులు అందించటం జరిగిందని అన్నారు. కరోనా భారిన పడకుండా అనునిత్యం ప్రజలను అప్రమత్తం చేయటంలో మీడియా పాత్ర వెలకట్టలేనిదని అన్నారు.

ఈ సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్న పాత్రికేయులను ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో
వరంగల్ అర్బన్ జిల్లా టియూడబ్ల్యూజె (H-143)ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్ , ఓటుకూరి సాయిరాం,
అంతడుపుల శ్రీనివాస్, తిప్పిరిశెట్టి శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్, బానోత్ వెంకన్న, మాడ నర్సయ్య, దామెర రాజేందర్, కే. వెంకట్, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు..

ప్రతిఒక్కరు కారోన నుండి క్షేమంగా బయటపడలి

హైదరాబాద్ శ్రీనిధి కళాశాల రిజిస్టర్
చందా సాంబయ్య
వరంగల్ అర్బన్ :-
ప్రతిఒక్కరు కారోన వైరస్ ఎదుర్కొని క్షమంగా ఉండాలంటే తమ ఇండ్లలో ఉండటమే సురక్షితమని హైదరాబాద్ శ్రీనిధి ఇనిస్టుట్ సైన్స్ టెక్నోలజీ కళాశాల రిజిస్టర్ చందా సాంబయ్య పిలుపునిచ్చారు వరంగల్ గ్రేటర్ పరిధిలోని 5 వ డివిసన్ బొల్లికుంటా కీ.శే.శ్రీమతి పోగు రామక్క జ్ఞాపకార్ధం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగినది కరోనలాంటి మహామర్రిని పరదోలి పేదలకు పేదలను అందుకోడానికి దాతలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు కేంద్రరాష్ట్ర ప్రభుత్వంలు కారోన నివారణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారను తెలిపారు సామాజిక దూరం పాటించడమే కరోనను ఎదుర్కొనే లక్ష్యం అన్నారు కారోన వైరస్ వ్యాప్తి నేపధ్యం లో కూలీలు ఇబంధులు ఎదుర్కొంటున్నారాని సాంబయ్య ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరు ఈ విపక్తరా సమయం లో ప్రతీ ఒక్కరు వ్యక్తీగత పరిశుభ్రత పాటించి ప్రతి 6 గంటలకు ఒకసారి సబ్బుతో చేతులు శుభ్రం చేస్కుకోవలన్నారు అత్యవసర పనులైన మధులు,నిత్యావసర సరుకులకోసం మాత్రమే ఇండ్లనుడి బయటకు రావాలని సాంబయ్య కోరారు ఈ కార్యక్రమంలో 150 మంది గ్రామస్థులకు 8 రకాల నిత్యావసర సరుకులు చొప్పున పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో 5వ డీవిసన్ పసునుటి స్వర్ణలత వజ్రయా N R I వెల్లుదండి సునీత ,వద్దనాల అనిత,రామ సరిత చందా ప్రశాంత్ కాళోజి హేల్త్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ పోగు సత్యనారాయణ చందా లలిత పద్మశాలి కులపెద్ద మనుషులు ఆడ్లగట్టా భిక్షపతి ,మార్గం ఎల్లయ్య , మార్గం రాంచేదర్ , గుండు శ్రీనివాస్,చిగురాల కోటేశ్వర్ ,మార్గం సారగం గణపురాపు రమేష్ వేలుదాడి సునీత తదితరులు పాల్గొన్నారు

ఇండ్లే పేకాట కేంద్రంగా నడుపుతున్న యాజమానులు

మద్యం సేవిస్తూ పేకాట ఆడుతూ ఎంజాయ్

లీడర్లు, ఫైనాన్స్, మద్యం వ్యాపారులదే హవా

ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు

*వరంగల్ సిటి నేటిధాత్రి*

వరంగల్ నగరంలో పేకాట కేంద్రాలు మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తున్నాయి ఇందుకు ఇంటి యజమానులే ఒక సెటప్ ఏర్పాటు చేసుకొని గ్యాంగ్ గా ఏర్పాటై గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నట్టు సమాచారం అండర్ రైల్వే గేటు ప్రాంతంలో విచ్చలవిడిగా పేకాట కేంద్రాలు ఏర్పాటు చేసుకుని రాత్రింబవళ్లు నడుపుతున్నారు కరిమాబాద్,ఎస్ ఆర్ ఆర్ తోట గుండుబావులు, జన్మభూమి జంక్షన్ ,నానామియాతోట,చెట్లోల్ల గడ్డ, 60 ఫీట్ల రోడ్డు ప్రాంతంలో ఇండ్లలోనే కేంద్రాలు ఏర్పాటు చేసుకుని వేలకు వేలు నగదు పెట్టి నడుపుతూ పబ్బం గడుపుతున్నారు ఇందులో బడాబాబుల చేతులు కూడా ఉన్నట్టు సమాచారం పోలీసులు దాడులు చేసినప్పటికీ ఈ తతంగం మాత్రం కొనసాగుతూనే ఉంది పొలిటికల్ లీడర్లు, ఫైనాన్స్ వ్యాపారులు, మద్యం వ్యాపారులు, దండిగా డబ్బులు పోసి ఆడుతూ కాలం వెల్లదీస్తున్నారు ఇంట్లోనే ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని పేకాట తో పాటు మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కరోనా నేపథ్యంలో పోలీస్ సిబ్బంది లాక్ డౌన్ అతిక్రమించకుండా కట్టడి చేస్తుంటే గుంపులుగా చేరి మద్యం సేవిస్తూ పేకాట ఆడటం పై చుట్టు పక్కల ప్రాంతాల వాసులు తప్పు పడుతున్నారు ఇలా పేకాట ఆడుతూ మనస్పర్థలు పెంచుకుంటూ శత్రుత్వం తో గొడవలకు దారి తీస్తున్నట్టు తెలుస్తుంది అసలే కరిమాబాద్ సిరంగిరాజారామ్ తోట ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుండి ఆకతాయిలు హాల్ చేస్తూ రోడ్ల పై నిలిచి ఉన్న కారు ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు మరో సంఘటనలో కర్రలతో కత్తులతో దాడులు చేసుకున్న ఘటనలు ఉన్నాయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పేకాట కేంద్రాలను నడిపిస్తూ శత్రుత్వాలు పెంచుకుంటున్నారు అని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికి లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపై కారణాలు లేకుండా తిరిగే వారిని ఇటు సాయంత్రం 7 గంటల తరువాత కర్ఫ్యూ నేపథ్యంలో తెరచి ఉన్న దుకాణాలను నివారిస్తూ విచ్చల విడిగా తిరిగే గ్యాంగులను కట్టడి చేస్తున్న పోలీసులకు ఇది ఒక సవాల్ గా మారింది ఏది ఏమైనప్పటికి ఇలాంటి సంఘటనలను ఛేదించటంలో మిల్స్ కాలనీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పేకాట నడుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోటానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version