తహసీల్దార్‌ తీరుపై రైతుల ఆందోళన…,

తహసీల్దార్‌ తీరుపై రైతుల ఆందోళన…

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో సకాలంలో పనులు చేయకుండా అధికారులు జాప్యం చేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఐనవోలు మండలం ఏర్పాటైన నాటి నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని, అయినప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు కాలేదంటూ ఒకరి తరువాత ఒకరుగా బదిలీపై వెళ్తున్నారన్నారు. ఈ విషయంపై ఆర్డీవోకి మొరపెట్టుకున్న పనులు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మా భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు కాకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు అంటున్నారు.

తృటిలో తప్పిన పెను ప్రమాదం

తృటిలో తప్పిన పెను ప్రమాదం

జనగాం జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రంలో కారు ఎదురుగా రావడంతో ఆర్టీసి బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. భూపాలపల్లి డిపోకు చెందిన ఎపి 29 జడ్‌ 3750 నంబర్‌ గల బస్సు హన్మకొండ నుంచి ఉప్పల్‌ ఎక్స్‌రోడ్డు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలను ఒకవైపునకు మళ్లించారు. కారు రాంగ్‌ రూట్లో వేగంగా రావడంతో బస్సును పక్కన ఉన్న కంకర కుప్పలోకి డ్రైవర్‌ మళ్లించాడు. దీంతో బస్సును కంకర కుప్ప ఆపింది. డ్రైవర్‌ చాకచక్యంగా బస్సు నడపడంతో పెనుప్రమాదం తప్పింది. ఆర్టీసి అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బస్సు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణీకులను మరో బస్సులో తరలించారు. కంకర కుప్ప లేకపోతే బస్సు బోల్తా పడేదని ప్రయాణీకులు తెలిపారు.

టిఎస్‌ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్‌.జగన్‌

టిఎస్‌ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్‌.జగన్‌

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శిగా డి.ఎస్‌.జగన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం మసాబ్‌ట్యాంక్‌లోని సమాచార భవన్‌, మీడియా అకాడమీ కార్యాలయంలో కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వరంగల్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడిగా పనిచేస్తున్న డి.ఎస్‌.జగన్‌కు మీడియా అకాడమీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు పదవీ బాధ్యతలు స్వీకరించి జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు కృషి చేస్తానని తెలిపారు.

ఉమా బుక్‌స్టాల్‌పై దాడులు

ఉమా బుక్‌స్టాల్‌పై దాడులు

వరంగల్‌ నగరంలో ప్రైవేటు పాఠశాలలకు సంబందించిన నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలను ఉమాబుక్‌ స్టాల్‌ నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల నగరంలోని దేశాయిపేట రోడ్‌లో నిర్వహిస్తున్న ఉమా బుక్‌స్టాల్‌పై సొమవారం తూనికలు, కొలతల అధికారలు దాడులు నిర్వహించి బుక్‌స్టాల్‌ నిర్వాహకులు అమ్ముతున్న నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. వాటిపై ఉన్న రేట్లను క్షణ్ణంగా పరిశీలించారు. ఎమార్పి రేట్ల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తూనికల, కొలతల అధికారలు హెచ్చరించారు. నగరంలో ప్రైవేటు పాఠశాలలు కొన్ని బుక్‌స్టాల్‌ వారితో కుమ్మక్కయి అక్రమ దందా నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నారని అధిక ధరలకు పుస్లకాలను అమ్ముతున్నారని, కొన్నింటిపైనా ఎమ్మార్పి రేటు లేకుండానే నిర్వాహకులు ఎంత చెబితే అంత ఇచ్చి కొనాల్సిందేనని, పుస్తకాల భారం మోయలేకుండా ఉన్నదని తల్లిదండ్రులు వాపోతున్నారు. వారి ఫిర్యాదు మేరకు సొమవారం చేపట్టిన తనిఖీల్లో ఎమ్మార్పి లేకుండా విక్రయిస్తున్న పుస్తకాలు, నోట్‌బుక్‌లు కొన్ని లభ్యమయినట్లు తెలుస్తున్నది. ఈ దాడులు నగరమంతా నిర్వహించి ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మినా, ప్రైవేటు పాఠశాలలతో కుమ్మక్కై వ్యాపారం నిర్వహించినా కఠిచర్యలు తీసుకుంటామని, మరో రెండురోజుల పాటు ఈ దాడులు నిర్వహిస్తామని అధికారలు తెలిపారు.

యదార్థవాది లోక విరోధి…!

యదార్థవాది లోక విరోధి…!

నేటిధాత్రి కథనాలు కొంతమంది జర్నలిస్టులు అలియాస్‌ ఎర్నలిస్టులకు మింగుడు పడడం లేదు

రెచ్చిపోతున్న చదువు,తెలివి లేని డమ్మీ జర్నలిస్ట్‌ లు

వసూళ్ల కోసం ప్రోత్సహిస్తున్న పెద్ద పత్రికల్లోని స్వయం ప్రకటిత మేధావులు

పొట్టచీరితే అక్షరం ముక్కరాదు జర్నలిజాన్ని మొత్తంగా వారే మోస్తున్నట్లు బిల్డప్‌

నిజాలు రాస్తున్న నేటిధాత్రిపై నోరు పారేసుకుంటున్న ఎర్నలిస్టులు

సంపాదనే ద్యేయంగా తెలివిమీరిపోతున్న కొందరు జర్నలిస్టులు అలియాస్‌ ఎర్నలిస్ట్‌లపై సంచలన కథనం త్వరలో….

తక్షణం పరిష్కరించండి

తక్షణం పరిష్కరించండి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై శాఖలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పరిష్కారమార్గం చూపెట్టాలని, అపరిష్కతంగా ఉంటే సంబంధిత శాఖ ఉన్నతాధికారి బాధ్యలవుతారని స్పష్టం చేశారు. పెండింగ్‌ ఫిర్యాదులపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువ వస్తున్నందున రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఆయాశాఖల అధికారులకు పంపించినప్పుడు వెంటనే స్పందించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు ఎన్ని సమస్యలు పరిష్కరించారు, మిగిలినవి ఎందుకు పరిష్కరించలేకపోయారో కూడా స్పష్టమైన వివరణ ఇవ్వాలని, సంబంధిత నివేదికలను అందజేయాలని సంయుక్త కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ప్రాదేశిక ఎన్నికల కోడ్‌ ముగిసినందున ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై ప్రత్యేక దష్టిపెట్టాలని సంయుక్త కలెక్టర్‌ జిల్లా అధికారులకు తెలిపారు. పథకాల అమలులో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయం మర్చిపోవద్దని అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజావాణికి వచ్చిన వారి నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా, డీఆర్వో ఎన్‌. ఖీమ్యానాయక్‌తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో రవీందర్‌, డిడేంలంమ సరస్వతి , డిసిఓ మహమ్మద్‌ అలీ, ఈఈలు విగ్నేశ్వర్‌రెడ్డి, కనకరత్నం, డిటిఓ కొండల్‌ రావు , సిపిఓ రాజారామ్‌, డిఎస్‌సిడిఓ రాజేశ్వరి, బిసిడిఓ సువర్ణ కిరీటి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణికి జన తాకిడి…కిక్కిరిసిన కలెక్టరేట్‌

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ శాఖలకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ప్రాదేశిక ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం ప్రజవాణిని తిరిగి ప్రారంభించడంతో పెద్దఎత్తున ప్రజలు కల్లెక్టరేట్‌కు తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు తెలిపారు. మొత్తం 163 దరఖాస్తులు రాగా వాటిలో పెన్షన్‌ సంబంధిత దరఖాస్తులు 82 కాగా, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు కోరుతూ 31, రెవిన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోరుతూ 50 దరఖాస్తులు అందాయి.

14 nunchi badibaata, 14 నుంచి బడిబాట

14 నుంచి బడిబాట

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో ఈనెల 14 నుంచి 19 వరకు ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామస్థులు, పజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ రోజువారీగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ధ్యేయంగా జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ నిర్వహించనుంది.

డిజిటల్‌ తరగతుల బోధన…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి వాటిని సంరక్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం బడిబాట పేరిట ఏటా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గతంలో వేసవి సెలవుల్లోనూ నిర్వహించినా, ఆ దిశగా కొంత మేర సఫలీకతం అయ్యింది..దీంతో ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకుంటూ అయిదేళ్లు నిండిన విద్యార్థులతోపాటు గ్రామాల్లో బడిఈడు పిల్లలను చేర్పించాలని భావిస్తోంది. గతేడాది చాలామంది విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఆంగ్ల మాధ్యమాలను ప్రవేశపెట్టింది. దీంతో కొన్ని గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా..పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో విద్యార్థుల నమోదు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల సానుకూలత కనిపిస్తోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు ఇందుకు దోహదం చేస్తున్నాయని చెప్పక తప్పదు. మధ్యాహ్న భోజనం, డిజిటల్‌ తరగతులు, ఆంగ్ల మాధ్యమం ఉచితం, సమరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, వివిధ రకాల ఉపకార వేతనాలు అందుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఐదురోజుల పాటు..

జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని ఐదురోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకు ఒక్కోరోజు ఒక్కో విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. బడిబాట మొదటిరోజున ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేయాలని సూచించింది. పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను అట్టహాసంగా చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 11గంటల వరకు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.

బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి ….

సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా

ఐదు సంవత్సరాలు నిండిన బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట అవగాహన కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. ప్రైవేటు పాటశాలతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలో వసతులు, నాణ్యమైన విద్య విషయం తదితర అన్ని విషయాలలో ప్రభుత్వ పాఠశాలలు మెరుగన్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత ప్రభుత్వ శాఖలు పర్యటించి ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. టార్గెట్‌ బేస్డ్‌ అప్రోచ్‌ తో అధికారులు ముందుకు సాగలన్నారు. జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. మధ్యలో బడి మానివేసిన విద్యార్థులను కూడా గుర్తించి పాఠశాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బడిబాటలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతీరోజు ర్యాలీలు నిర్వహించి నమోదును పెంచేందుకు కషి చేయాలన్నారు. విద్యార్థుల నమోదు వివరాలను విధిగా ప్రతీరోజు ఎంఈవో కార్యాలయానికి పంపాలన్నారు. బడి మానివేసిన విద్యార్థుల వివరాలను సేకరించి..అందరూ బడిలో చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 14 నుంచి బడిబాట నిర్వహించాలన్నారు. బడిబాట నిర్వహించే సమయంలో ప్రతిరోజు ఎంతమంది విద్యార్ధులను పాఠశాలల్లో చేర్పించారో పారదర్శకంగా తెలిపేలా పాఠశాల, మండల, జిల్లాస్థాయిలో బడిబాట డెస్క్‌ను తప్పక ఏర్పాటుచేసి ఒక బాధ్యున్ని నియమించాలని ఆదేశాలు అందాయన్నారు. బడిబాట విజయవంతానికి అధికారులు పాటుపడాలన్నారు.

బడిఈడు పిల్లలను గుర్తిస్తాం…

– ధనాలకోట రాధాకిషన్‌, జిల్లా విద్యాధికారి, రాజన్న సిరిసిల్ల

బడిఈడు, బడి బయటి పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేలా అధికారులకు సూచించాం. ఉపాధ్యాయులతో బడిబాట కార్యక్రమం చేపట్టనున్నాం. అంగన్‌వాడీలో ఐదేళ్లు నిండిన పిల్లలను, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేరేలా కషి చేస్తాం. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సైతం పాల్గొనేలా ఉద్యోగులకు వివరించాం.

14 nunchi certificatela parishilana, 14నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

14నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామక తుదిపరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 14వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన 1,02,048మంది అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నట్లు రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి వెల్లడించింది. ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 17కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు నియామక మండలి తెలిపింది. అభ్యర్థులు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టిఎస్‌ఎల్‌పిఆర్‌బి.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి సమాచార లేఖలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొంది. ఈనెల 12వ తేదీ ఉదయం 8గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని మండలి తెలిపింది.

anganvadi kendralathone chinnarula abhivruddi, అంగన్‌వాడీ కేంద్రాలతోనే చిన్నారుల అభివద్ధి

అంగన్‌వాడీ కేంద్రాలతోనే చిన్నారుల అభివద్ధి

అంగన్‌వాడీ కేంద్రాలలో అందించే పోషక ఆహార పదార్థాల వలన చిన్నారులు అభివద్ధి చెందారని అంగన్‌వాడీ కార్యకర్త నల్ల భారతి అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో ఏఎల్‌ ఎస్‌ఎంసీ చైర్మన్‌ వాసం కవిత ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు, తల్లులతో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్లా భారతి మాట్లాడుతూ 3 నుండి 5సంవత్సరాల చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. అంగన్‌వాడి కేంద్రాలలో పోషకాలతో కూడిన భోజన వసతులు పాలు, కోడిగుడ్డు అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులు శారీరకంగా, మానసికంగా ఎదగడం కోసం ఆటలు, పాటల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి.గౌసియాబేగం, సునీత, కమిటీ సభ్యులు రవళి, కవిత, సనాతోపాటు చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.

majjiga packetla papini, మజ్జిగ ప్యాకెట్ల పంపిణి

మజ్జిగ ప్యాకెట్ల పంపిణి

హైదరాబాద్‌లోని మణికొండ ల్యాంకో హిల్స్‌ మర్రిచెట్టు సర్కిల్‌ వద్ద విఆర్‌4యు సంస్థ సీనియర్‌ సిటిజన్‌ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి కార్యక్రమాన్ని చేపట్టామని ఆ సంస్థ అధ్యక్షుడు బాపూజీ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు నేడు ఉదయం 10గంటల నుండి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఈ మజ్జిగ పంపిణికి మణికొండ మాజీ సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి సహకరించాలని తెలిపారు. మా సీనియర్‌ సిటిజన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం జాయింట్‌ సెక్రటరీ ప్రదీప్‌రావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మా సంస్త ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. మా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్చభారత్‌, పర్యావరణ పరిరక్షణ, అనాథ పిల్లలకు చేయూత వంటి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే నేడు మజ్జిగ పంపిణీని చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి దిలీప్‌ థక్కడ్‌, సభ్యులు డాక్టర్‌ ప్రభావతి, సాంబశివరావు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

harithaharaniki siddamina nursary, హరితహారానికి సిద్దమైన నర్సరీ

హరితహారానికి సిద్దమైన నర్సరీ

హసన్‌పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో నర్సరీని ఎపిఎం విజయలక్ష్మి సోమవారం సందర్శించారు. నర్సరీ మొక్కలు వర్షాకాలం దగ్గర పడటంతో నర్సరీలోని మొక్కలు నాటడానికి సిద్దం చేయాలని అన్నారు. ప్రతి ఇంటికి రెండుమొక్కలు నాటాలని, రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటాలని, వాటిని కాపాడే బాధ్యత అందరూ తీసుకోవాలని తెలిపారు. టేకు, దానిమ్మ, సీతాఫలల చెట్లు, పూలమొక్కలు, నీడనిచ్చే మొక్కలు రాబోయే తరం వారికి కూడా ఉపయోగపడేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పచ్చని చెట్లు-ప్రగతికి మొట్లు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కొండ రాజ్‌కుమార్‌, టిఎ సృజన సుదర్శన్‌, అశోక్‌, గ్రామ సర్పంచ్‌ చిర్ర సుమలత, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

anganvadi teacherla badibata, అంగన్‌వాడీ టీచర్ల బడిబాట

అంగన్‌వాడీ టీచర్ల బడిబాట

చిన్నారులను బడిబాట పట్టించేందుకు అంగన్‌వాడీ టీచర్లు రోడ్డుబాట పట్టారు. ఐదేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులలో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలబాలికలు ఐదేళ్లలోపు పిల్లలు అంగన్‌వాడీకి పంపాలని, ఐదేళ్లు దాటిని పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని అంగన్‌వాడీ టీచర్లు గ్రామాలలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో గ్రామగ్రామాన ర్యాలీలు చేపడుతున్నారు. 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు బడిబాట చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్‌ ఎ.రాధిక, సర్పంచ్‌ జెన్నయ్య, ఉపసర్పంచ్‌ గట్టు శివకుమార్‌, తరగం సునీత, ఆయా రజియా, కో ఆప్షన్‌ మెంబర్‌ ఎస్‌కె.లాల్‌, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

kakisthara…thappisthara…?, కక్కిస్తారా…తప్పిస్తారా…?

కక్కిస్తారా…తప్పిస్తారా…?

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో క్యాంపు పేరిట లక్షల రూపాయలను అక్రమంగా మెక్కేశారని, దొంగల పేర్లతో దొంగ అకౌంట్లు సేకరించి క్యాంపులో భాయ్స్‌గా పనిచేసినట్టు దొంగతనంగా పేర్లను రాసి లక్షల రూపాయలల్లో అవినీతికి పాల్పడినారని, అవినీతి జరిగిన తీరుపై వెంటనే విచారణ కమిటిని వేసి బాధ్యులను గుర్తించి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘంలు డిమాండ్‌ చేస్తున్నా ఇప్పటి వరకు కమిటినీ వేయకుండా కాలయాపన చేస్తున్నదని ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.

క్యాంపు పేరుతో లక్షల రూపాయలు మాయం

ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపు కార్యాలయంలో దొంగబిల్లులు పెట్టి, భాయ్స్‌గా పనిచేయకున్నా పనిచేసినట్టుగా దొంగపేర్లను రాసి డబ్బులు నొక్కేశారని తెలుస్తోంది. డిఐఈవో కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల అకౌంట్లలో, అందులోనే పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగుల అకౌంట్లలో, పింగిళి మహిళ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి సంబందించిన వారి అకౌంట్లలో దొంగదారిన డబ్బులు జమచేశారని అవినీతి వ్యతిరేఖ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వొడపెల్లి మురళి ఆరోపించారు. అక్రమంగా సుమారుగా 90 మంది అకౌంట్లలో వేశారని ఒక్కో అకౌంట్లో రూ.8.540 నుండి రూ.16.653 వరకు వేశారని, వీటిని తిరిగి సూపరింటెండెంట్‌ సాయబాబా కలెక్ట్‌ చేసుకొని ప్రభుత్వ సొమ్మును అప్పనంగా నొక్కేశారని, నొక్కేసిన డబ్బులను కలిసి పంచుకున్నారని ఆరోపించారు.కేవలం సుతిల్‌ దారాలకు 50వేల రూపాయలు అయినట్లు బిల్లులు పెట్టారంటే ఇంకా స్టేషనరీ పేరుతో ఎంతెంత నొక్కేసి వుంటారో అర్ధం చేసుకోవచ్చని సంఘాల నాయకులు అంటున్నారు.

కార్యాలయ సిబ్బంది ఆఫీస్‌ భాయ్స్‌ ఎలా అవుతారు?

డిఐఈవో కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌, రెగ్యులర్‌ ఉద్యోగుల అకౌంట్లలలో కూడా క్యాంపు ఆఫీసులో మూటలు మోశారని, పేపర్‌ బండిల్స్‌లు అందించారని ఆఫీస్‌ భాయ్స్‌గా పనిచేశారని వారి అకౌంట్లలలో డబ్బులు వేశారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు రోజువారి కూలీలు ఎలా అవుతారో? డిఐఈవో లింగయ్య, సూపరింటెండెంట్‌ సాయిబాబాలే ప్రజలకు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. కార్యాలయంలో అటెండర్‌ నుండి ప్రభుత్వ ఉద్యోగి వరకు ఎవరిని వదలకుండా అందరి అకౌంట్లలో రోజువారి కూలీల మాదిరిగా, క్యాంపుభాయ్స్‌ పేరిట అకౌంట్లలో డబ్బులు చెక్కుల ద్వారా వివిద బ్యాంక్‌లల్లో జమ చేశారు. అవకతవకలపై, అవినీతిపై ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ కమిటిని వేసి ప్రభుత్వం తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

hanthakulanu katinaga shikshinchali, హంతకులను కఠినంగా శిక్షించాలి

హంతకులను కఠినంగా శిక్షించాలి

బక్కి శ్రీను హంతకులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌) కిషన్‌వర్గం రాష్ట్ర నాయకుడు గడ్డం సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్కి శ్రీను హంతకులను కూడా శ్రీనును చంపిన విధంగానే ఉరితాడుకు వేలాడేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని జెఎసికి పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బక్కి శ్రీను హంతకులను శిక్షించాలని ఆందోళన చేస్తూ పోరాటం చేస్తున్న జెఎసికి సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు. అదేవిధంగా బక్కి శ్రీను సంస్మరణ సభ సందర్భంగా శ్రీను కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు.

16na sanmana karyakramam, 16న సన్మాన కార్యక్రమం

16న సన్మాన కార్యక్రమం

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మేదరి ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో మేదర విద్యార్థులు, ఉద్యోగులు, పదవీవిరమణ పొందిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆ సంఘం అధ్యక్షుడు ప్రతాపగిరి ప్రసాద్‌, జనరల్‌ సెక్రటరీ దండుగుడుము ఉపేందర్‌ తెలిపారు. శనివారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లలో అధికమార్కులు సాధించిన మేదరి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని అన్నారు. అదేవిధంగా కొత్తగా ఉద్యోగం పొందిన వారికి, ఉద్యోగంలో పదోన్నతులు పొందిన వారికి, ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీవిరమణ పొందిన వారికి ఈనెల 16వ తేదీన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమం వరంగల్‌ జెమిని టాకీస్‌ సమీపంలోని పోతన విజ్ఞాన పీఠంలో జరుగుతుందని, అర్హత కలిగిన విద్యార్థులు తమ మార్కుల జాబితాలను అందజేయాలని తెలిపారు. ప్రోత్సాహాక కమిటీ ద్వారా వారి తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా ఆహ్వానం తెలుపుతామని అన్నారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు కూచనపల్లి శ్యామ్‌సుందర్‌, ఉపాధ్యక్షులు ప్రతాపగిరి సత్యదేవ్‌, దీకొండ సరిత, లీగల్‌ అడ్వైజర్‌ కూచనపల్లి వెంకటేశ్వర్లు, చీఫ్‌ అడ్వైజర్‌ సిలువేరు మల్లిఖార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

upadihami panula zoru, ఉపాధిహామీ పనుల జోరు

ఉపాధిహామీ పనుల జోరు

హసన్‌పర్తి మండలంలోని సీతానాగారం గ్రామంలో వర్షాకాలం రావడంతో కూలీలు భారీసంఖ్యలో ఉపాధిహామీ పనులకు వస్తున్నారని ఎపిఓ విజయలక్ష్మి తెలిపారు. కాలం రావడంతో ఎవరి పొలంలో వారు మట్టి కొట్టుకపోకుండా కూలీలు అధికసంఖ్యలో పాల్గొన్నారన్నారు. మబ్బులు చల్లపడటంతో కూలీలు సంతోషంగా పనులు చేస్తున్నారన్నారు. రైతులు వారివారి పొలాల్లో మట్టిని పోసుకుంటున్నారని, ఉపాదిహామీ కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడటంతోపాటు వారి అవసరాలను తెలుసుకున్నానని చెప్పారు. ఇంతమంది కూలీలు వందరోజుల పనిని వినియోగించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ అయిలయ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రవీందర్‌, టిఎ సృజన తదితరులు పాల్గొన్నారు.

avirbava dinostavanni jayapradam cheyali, ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు పుట్ట రవి అన్నారు. శుక్రవారం హసన్‌పర్తి మండలకేంద్రంలో ఎమ్మార్పీఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పుట్ట రవి మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంద కృష్ణమాదిగ పర్యటన సందర్భంగా ఉదయం 7గంటలకు మహబూబాబాద్‌ జిల్లాలోని గంగారం మండలకేంద్రంలో, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో ఉదయం 11గంటలకు, ములుగు జిల్లాకేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంటలకు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2గంటలకు, జనగామ జిల్లాలో 5గంటలకు మంద కృష్ణమాదిగ పర్యటన అన్ని జిల్లాలలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పాదయాత్రకు సంఘీభావంగా ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాలు కలసిరావాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఈమామూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం 25లక్షల మందితో భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. 25సంవత్సరాల ఉద్యమస్ఫూర్తి అట్టడుగు పేదల స్ఫూర్తిదాయంగా ఎమ్మార్పీఎస్‌ నిలిచిందని అన్నారు. ఇంటికి ఇద్దరు, పల్లెకు 2వాహనాల చొప్పున తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారపు బిక్షపతి, మండల అధ్యక్షుడు రేణుకుంట్ల దుర్గాప్రసాద్‌, నాయకులు రామంచ సంపత్‌, కేతపాక సదానందం, పలనాటి రవీందర్‌, రాజు, జనార్థన్‌, ప్రసాద్‌, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

vyardalatho niduthunna peddacheruvu, వ్యర్థాలతో నిండుతున్న పెద్దచెరువు

వ్యర్థాలతో నిండుతున్న పెద్దచెరువు

జంతు కళేబరాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పాడవేసిన చెత్తతో దుగ్గొండి పెద్దచెరువు వ్యర్థాలతో నిండిపోతున్నదని బహుజన సమాజ్‌వాది పార్టీ నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు గజ్జి దయాకర్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా దయాకర్‌ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండల కేంద్ర పెద్దచెరువులో రోజురోజుకు వ్యర్థాలు పెరిగిపోయి చెత్త, జంతు కళేభరాలు, వివిధ రకాల వ్యర్థలతో నిండి వున్నాయని, రాబోయే వర్షాకాలంలో చెరువు నిండి ఆ వ్యర్ధాలతో తాగునీటి బావిలో కలిసి తాగునీరు కూడా కలుషితం అయ్యి ప్రజలు రోగాల బారినపడే ప్రమాదం ఉందని తెలిపారు. వర్షాకాలంలో అంటువ్యాదులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే గ్రామంలోని జంతువులు చెరువులో నీటిని ఎల్లప్పుడు తాగుతూ ఉంటాయని, అవి కూడా రోగాలకు గురయ్యే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యల పట్ల సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకుని వాతావరణ కాలుష్య నివారణను అరికట్టాలని దయాకర్‌ కోరారు.

జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌ ..

జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌ ..

వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ వైస్‌చైర్మన్‌గా దుగ్గొండి మండల జడ్పీటీసీ సభ్యులు ఆకుల శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. జిల్లా పరిషత్‌ వరంగల్‌ రూరల్‌ జిల్లా ఫ్లోర్‌లీడర్‌గా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి, నల్లబెల్లి మండల జడ్పిటిసి సభ్యురాలు పెద్ది స్వప్న ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

ఆటోడ్రైవర్‌ నుంచి జడ్పీ వైస్‌చైర్మన్‌ వరకు..

ఆటోడ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభం చేసిన ఆకుల శ్రీనివాస్‌ నేడు జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌గా ఎదిగాడు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఆనాటి నుండి టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతలు నెరవేరుస్తూ ఇటీవల జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో డివిజన్లోనే అత్యధిక మెజార్టీతో జడ్పిటిసిగా ఎన్నికైనారు.

ఉద్యమరాలుగా మొదలై జడ్పి ఫ్లోర్‌లీడర్‌గా….

మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని విభాగంలో క్రియాశీలకంగా పనిచేసిన పెద్ది స్వప్న అనేక పోరాటాలలో పాల్గొన్నది. అనేకమార్లు తెలంగాణ సాధన ఉద్యమ పోరాటంలో లాఠీదెబ్బలకు బలై, జైలు జీవితం అనుభవించింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు రాజకీయంలో క్రియాశీలకంగా మారాలని పిలుపుతో నేడు నల్లబెల్లి మండలం నుండి టీఆర్‌ఎస్‌ పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా గెలుపొంది వరంగల్‌ రూరల్‌ జిల్లా జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా ఎన్నికైనారు.

ఆనాడు భర్త…ఈనాడు భార్య….

తెలంగాణ ఉద్యమ పోరాటం గల్లీ నుండి ఢిల్లీ వరకు చేరే విధంగా ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై తమ గళాన్ని వినిపించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆనాడు జరిగిన జడ్పీటిసి ఎన్నికల్లో నల్లబెల్లి మండలం నుండి జెడ్పీటీసి సభ్యుడిగా ఎన్నికైనా ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా ఎన్నికై తన సత్తాను చాటారు. నేడు అదేబాటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న పెద్ది స్వప్న నేడు నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యురాలుగా ఎన్నికై వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

దుగ్గొండి, నల్లబెల్లి మండల ప్రజల హర్షం వ్యక్తం

వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌, జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా పెద్ది స్వప్న సుదర్శన్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల దుగ్గొండి, నల్లబెల్లి మండలాలతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు.

bandedu baram…private chaduvu, బండెడు భారం…ప్రైవేటు చదువు

బండెడు భారం…ప్రైవేటు చదువు

వరంగల్‌ నగరంలోని ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అధికంగా ఫీజులు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టై, బెల్ట్‌, విద్యార్థులకు అవసరమైన సామాగ్రి పాఠశాలలో, పాఠశాల యాజమాన్యం చెప్పిన చోటే విక్రయించాలి లేదంటే అంతే సంగతులు. ఇంత జరుగుతున్న పట్టించుకోవాల్సిన అధికారులు పత్తాలేకుండా పోతున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తంగా కొన్ని వందలకుపైగా ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఫీజులు వేలల్లో వసూలు చేస్తున్నా, నాణ్యమైన విద్యను అందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

పత్తా లేని విద్యాశాఖ అధికారులు

నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్న విద్యాశాఖ మామూళ్ల మత్తులో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొత్తకొత్త పేర్లతో పాఠశాలలను ఏర్పాటు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేస్తున్నారు. విచ్చలవిడిగా ఫీజులు గుంజుతున్న కానీ విద్యాశాఖ అధికారులకు పట్టింపే లేకుండా పోతుంది. జిల్లావ్యాప్తంగా వందల ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఫీజులు మాత్రం వేలల్లో వసూలు చేస్తున్న నాణ్యమైన విద్యను అందించడం లేదన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలకు నాణ్యమైన విద్య చెప్పించాలని పడుతున్న ఆరాటాన్ని ఆసరా చేసుకొని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. పెరిగిపోతున్న పోటీ ప్రపంచంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు పోటీపడడమే దీనంతటికీ కారణమని తెలుస్తుంది. కాని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజుల ధరలను చూసి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.

పాఠశాలల్లోనే విక్రయాలు

దాదాపు నగరంలో పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలతోపాటు విద్యార్థికి అవసరమైన సామాగ్రి విక్రయిస్తున్నారు. మరికొన్ని పాఠశాలలో పాఠశాల యాజమాన్యం చెప్పిన చోటే విద్యార్థికి కావాల్సిన సామాగ్రి, పుస్తకాలు కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టడం జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. విద్యాశాఖ అధికారుల నియంత్రణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికభారం పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రతి పాఠశాలలో నోటీసు బోర్టుపై తరగతుల వారిగా ఫీజుల వివరాలను నమోదు చేయాల్సి ఉన్నా అది ఎక్కడ కూడా నమోదు చేయడం లేదు. జీవో నం1 ప్రకారం తల్లిదండ్రుల కమిటీ నిర్ణయించిన ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి. కానీ ఆ పరిస్ధితులు ఎక్కడ కనిపించడం లేదు. విద్యాశాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడం అధికారుల కొరతతో ప్రైవేట్‌ యాజమాన్యం ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండానే పోతుంది. ప్రైవేట్‌ పాఠశాలలో ఏర్పాటుచేసిన కమిటీల సిఫార్సు ప్రకారమే ఫీజుల ధరలను నిర్ణయించాలి. దీనికోసం 2010లో ప్రభుత్వం జీవో నెం42ను తీసుకొచ్చింది. జీవో నెం42ను వ్యతిరేకిస్తూ 2014లో పాఠశాల యాజమాన్యం కోర్టుకు వెళ్లడంతో అర్థాంతరంగా నిలిచిపోయింది. జీవో నెం42 రద్దు చేయాలని ప్రైవేట్‌ పాఠశాలల యజమాన్యాలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. అప్పటినుంచి యాజమాన్యాలు అడ్డుఅదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాల యాజమన్యాలు యూనియన్లుగా ఏర్పడి అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు.

అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం

విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ప్రజల్లో అవగాహన లేకపోవడంతో అధికారులు అమలుచేయడం లేదు. చట్టప్రకారం ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో 25శాతం సీట్లను దారిద్రరేఖకు దిగువన ఉన్న విద్యార్థులకు అందించాలి. కాని ఇప్పటివరకు ఏ ఒక్క పాఠశాల ఉచితంగా సీటును వదులుకోవడం లేదు. అలాగే చట్టప్రకారం అవసరం మేరకు పాఠ్యపుస్తకాలు పిల్లలకు అందించాలి. ప్రజలకు పాలన సమీపంలో ఉన్న నేపథ్యంలోనైనా కలెక్టర్‌ దష్టి సారిస్తే కొంతమేరకైనా ఫీజుల భారం తగ్గుతుందని పలువురు అంటున్నారు.

కనీస వసతులు ప్రమాణాలు లేక పాఠశాల నిర్మాణాలు

పాఠ్యపుస్తకాల విక్రయదారులతో పాఠశాల యాజమాన్యాలు అనుసంధానంగా పుస్తకాల వ్యాపారం నడుస్తుంది. వరంగల్‌ నగరంలో ప్రధానంగా కొన్ని పుస్తక ఏజెన్సీలు ఉన్నాయి. ఆ ఏజెన్సీలు కొన్ని పాఠశాలలను ఎంచుకొని వారికి కొంత నగదు ముందే సమర్పించుకుంటారు. పాఠశాల విద్యార్ధులని బట్టి ముందే డబ్బులు అందచేస్తారు. అక్కడ నుండి మొదలవుతుంది వ్యాపారం. వ్యాపారంలో 40శాతం వరకు పాఠశాల యాజమాన్యాలకు అందచేస్తున్నట్టు సమాచారం. వీరి స్వలాభం కొరకు విద్యార్థుల తల్లితండ్రులపై విపరీతమైన భారం పడుతుందని చెప్పొచ్చు. ఇలా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసినా కానీ నాణ్యమైన విద్యని అందిస్తారని నమ్మకం కూడా తల్లితండ్రులు కోల్పోతున్నారు అని చెప్పొచ్చు. కొన్ని పాఠశాలల విద్యార్థులకు ఆటస్థలాలు లేకుండా బహుళ అంతస్తులో తరగతులు నడుపుతున్నా కానీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ఉండటంలో మతలబు ఏంటని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఏదైనా అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగితే బహుళ అంతస్తులో ఉన్న విద్యార్థులు ఏదైనా ప్రమాదానికి గురైతే భాద్యులు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం అగ్నిమాపక వాహనం పాఠశాల చుట్టూ తిరగలేని పరిస్థితుల్లో పాఠశాల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తున్నారు అని విద్యాశాఖ అధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అడ్డగోలు దోపిడీ….!

ఒకటవ తరగతి పుస్తకాల ఖరీదు 4,800రూపాయలు

కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని అడ్డగోలుగా వసూళ్లకు తెగబడుతున్నారు. ఫీజుల భారంతోపాటు పాఠ్యపుస్తకాల కొనుగోలు భారాన్ని మోపుతున్నారు. దీంతో తల్లితండ్రులు లబోదిబోమంటున్నారు. వరంగల్‌ నగరంలోని ఓయాస్సిస్‌ అనే పాఠశాల ఉమ బుక్‌స్టాల్‌తో ఒప్పందం కుదుర్చుకుని, కమిషన్‌లు దండుకుంటూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. వీరు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న ధరను చూస్తే గుండెలు గుభేలుమంటాయి. ఒకటవ తరగతికి వీరు అక్షరాల నాలుగువేల ఎనిమిదివందల రూపాయలను వసూలు చేస్తున్నారు. ఇదేంటని తల్లితండ్రులు నిలదీస్తే ఇది ఇంతే. మా దగ్గర తప్ప ఈ పుస్తకాలు ఎక్కడ దొరకవు అంటూ నిర్లక్షపు సమాధానం ఇస్తున్నారట. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసిన ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారట.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version