భక్తులతో కిటకిటలాడిన బిజిగిరి షరీఫ్ దర్గా

జమ్మికుంట :నేటి ధాత్రి

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకేషాప్ అలీ రహమతుల్లా అలై దర్గా సందల్ (గ్రంథ లేపనం) ఉత్సవం సోమవారం రాత్రి 11 గంటలకు మొళ్ళపల్లి గ్రామం పెద్ద బిజిగిరి షరీఫ్ గ్రామం నుండి భక్తిశ్రద్ధలతో, మేళతాళాలతో, అల్లాహ్ కీర్తనలతో ప్రారంభమై మంగళవారం తెల్లవారుజామున దర్గాకు చేరుకోగా దర్గాలోని సమాధులకు సందల్ అలరింపజేసి చాదర్లు సమర్పించారు. మత గురువు మౌలానా యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు చేసినారు. అనంతరం భక్తులు క్యూ లైన్ లో నిలబడి దర్గా దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమానికి జమ్మికుంట పట్టణ సిఐ వరంగంటి రవి ,పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా ముతవల్లి మహమ్మద్ అక్బర్ అలీ ,దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్;దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, దర్గా కమిటీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌపిక్ హుస్సేన్, దర్గా కమిటీ కార్యదర్శి మహమ్మద్ జమాల్ అష్రఫ్,దర్గా కమిటీ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ నయిముద్దీన్, షాహుస్సేన్ సభ్యులు అహమ్మద్, లతీఫ్ హుస్సేన్ ఆజమ్, జలీల్,తాజ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version