చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకు తండా వెంచరామి చైన్ పాక గ్రామాలకు గత రెండు మూడు సంవత్సరముల నుండి మొబైల్ సిగ్నల్ లేక చాలా అవస్థలు పడ్డారు గతంలో మాజీ ఎంపీ పసునూరి దయాకర్ ని కలిసి టవర్ నిర్మాణం కొరకు దరఖాస్తు చేయడం జరిగింది. ఎంపీ స్పందించి బిఎస్ఎన్ఎల్ టవర్ మంజూరు చేయడం జరిగింది. ఇకనైనా మా బాధలు తీరుతాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంతోషపడినారు కానీ టవర్ నిర్మాణం జరిగి సోలార్ సెట్టింగ్ కూడా చేయడం జరిగింది. ఇది జరిగి ఆరు నెలలు జరిగిన ఇప్పటివరకు సిగ్నల్ పాయింట్ పెట్టడం లేదు. టవర్ నిర్మాణం జరిగిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా సంతోషపడినారు కానీ వాళ్ళ ఆశలు అడియాశలు అయ్యాయి. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే సిగ్నల్ పాయింట్స్ ఇప్పించి మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సౌకర్యం కల్పించగలరని అందుకు తండా మాజీ సర్పంచ్ సిద్ధంకి భాస్కర్, ఎంపిటిసి భుక్య సుజాత రాజు నాయక్ వెంచరామీ మాజీ సర్పంచ్ ఖర్చు మల్లేష్, స్వామి బుక్య మోహన్ తదితరులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.