ఇంటింటి ప్రచారం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

కటకం జనార్ధన్ మాడ హరీష్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

బిఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్ భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల మేనిఫెస్టో పత్రాన్ని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి వివరిస్తూ స్థానిక 30వ వార్డ్ సత్తార్ నగర్ , మేన్రోడ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్ , భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు కరీం, 30వ వార్డ్ అధ్యక్షులు చిత్రజన్ , వార్డు నాయకులు యూత్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *