# గీసుగొండ మండల బీఅర్ఎస్ యూత్ అధ్యక్షులు శిరిసే శ్రీకాంత్.
వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గీసుగొండ మండల బీఅర్ఎస్ యూత్ అధ్యక్షులు శిరిసే శ్రీకాంత్ కోరారు.ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు గీసుగొండ మండల క్లస్టర్ ఇంచార్జ్ ల ఆధ్వర్యంలో గీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లి,మచ్చాపురం,కొమ్మాల, బొడ్డుచింతలపల్లి గ్రామలలో పట్టభద్రుల ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు.ఎన్నికల హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని బొడపెట్టాలని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ లు,కోట ప్రమోద్, మంద రాజేందర్, మచ్చాపురం ఎంపిటిసి కంబాల రజిత కోటి, యాత్ అధ్యక్షులు రాకేష్, బొడ్డుచింతల పల్లి పార్టీ అధ్యక్షులు పోగుల యుగేందర్, బండి రాజు,ఇందూరి ప్రవీణ్,కేదాసి సురేష్,కొమ్మలా యూత్ నాయకులు తాళ్లపెళ్లి ప్రసాద్, తాళ్లపెళ్లి తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.