బిఆర్ఎస్ హ్యాట్రిక్‌ పక్కా

సంక్షేమ పథకాలు- అభివృద్ధే గెలిపిస్తాయి

పరకాల పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మడికొండ శ్రీను

పరకాల నేటిధాత్రి(టౌన్) మంగళవారం రోజున పరకాల పట్టణంలోని 41,44,45,38 బూత్ కమిటీల సన్నాహక సమావేశం పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ మడికొండ శ్రీను మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగా రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేశారని,మరోమారు ప్రజలను ఓట్లు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌కే ఉందని అన్నారు. కాంగ్రెస్‌,బీజెపీ పార్టీల నేతల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు.రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుపారని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్‌ అమలు చేసిన పథకాలు,చేసిన అభివృద్ధే పరకాలలో చల్లా ధర్మారెడ్డి గెలుపునకు విజయసోపానాలు అని అన్నారు.పరకాల నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డి కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశారని,గతంలో ఈ ప్రాంతం గురించి పట్టించుకున్న నాథుడేలేడన్నారు.పరకాల పట్టణ దళిత బంధు కన్వీనర్ సోదా రామకృష్ణ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు,అభివృద్ధిని బూత్‌ కమిటీ సభ్యులు, నాయకులు ఇంటింటికీ తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ ఛైర్మెన్ రేగురి విజయపాల్ రెడ్ది, పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు చందుపట్ల రమణారెడ్డి,బండి సారంగ పాణి,నిప్పాని సత్యనారాయణ,పావుశెట్టి వెంకన్న,పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీశైలం, నాయకులు జాఫర్ రిజవి, బండారి సుగుణాకర్,దుంపేటి నాగరాజు,నక్క చిరంజీవి, పోరండ్ల సత్యనారాయణ, రాచర్ల అశోక్,బాసాని దయాకర్ కౌన్సిలర్లు పాలకుర్తి గోపి,నల్లెల్ల జ్యోతి అనిల్, నాయకులు చందుపట్ల నర్సింహా రెడ్ది,వార్డు కమిటీ అధ్యక్షులు చట్ల వెంకన్న, ఉడుత సుమన్,బండి నరేష్, బొచ్చు శ్రీను,రాయబారపు అనిల్,అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version