అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించిన బూర శ్రీనివాస్

పరకాల నేటిధాత్రి
అయ్యప్ప మండల కాలం నిష్టగా పూజలు చేసి మండల కాలం అనంతరం ఇరుముడి కట్టి కేరళ రాష్ట్రంలోని శబరి మల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరడం జరిగింది.శుక్రవారం పరకాల పట్టణంలోని హరిహర క్షేత్ర అయ్యప్ప ఆలయంలో ఆలయ గురుస్వామి మాణిక్యం బాపూరావు గురుస్వామి 30 మంది స్వాములకు ఇరుముడి కట్టి ఆశీర్వదించారు.అయ్యప్ప శరణు ఘోష నడుమ స్వాములు అందరూ ఇరుముడి ఎత్తుకొని స్వామియే శరణమయ్యప్ప అంటూ ప్రదక్షిణ చేసి కేరళలోని శబరి మల అయ్యప్ప ఆలయానికి బయలుదేరారు. పరకాల పట్టణనికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ బూర శ్రీనివాస్ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహా అన్నదానంలో పరకాల సిఐ వెంకటరత్నం, శివకృష్ణ, రవీందర్, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version