సేవా రత్నం జాతీయ అవార్డుకు ఎంపిక అయిన బొమ్మకంటి రాజేందర్

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో అర్టీజన్ కార్మికుడికి సేవా రత్నం జాతీయ అవార్డు కు ఎంపిక చేశారు
సేవరత్నం నేషనల్ అవార్డు – 2024 సంవత్సరమునకు గాను ప్రముఖ సంఘ సేవకులు బొమ్మకంటి రాజేందర్. ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటివారు ప్రకటించారు. అవార్డు సెలెక్షన్ కమిటి నేషనల్ చైర్మన్ బీఎస్ ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమి జాతీయ కార్యాలయములో అందజేశారు.ఈ సంధర్భంగా నల్లా రాధాకృష్ణ మట్లాడుతూ… ఎస్.సి., ఎస్.టి., బి.సి. & మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమి వారు ప్రతి ఏట ప్రజా ఉద్యమకారులకు, సంఘసేవకులకు, రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ సంవత్సరం డిసెంబర్ 15వ తేదిన దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగే బహుజన సాహిత్య అకాడమి 5 వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగ సేవరత్న నేషనల్ అవార్డును అందజేయనున్నట్లు తెలియజేశారు. ఆన్ఇండియాలోని 27 రాష్ట్రాల నుండి సుమారుగా 1000 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కు హాజరవుతారని తెలియజేశారు.ఈ ఆవార్డ్ లెటర్ అందజేసిన వారిలో . బి ఎస్ ఏ. జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ,
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యం.యం. గౌతమ్, రాష్ట్ర కో-ఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు, అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ చిలువేరు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version