అబివృద్ధిని చూసి ఆశీర్వదించండి

*ప్రభుత్య విప్ రేగా కాంతారావు*

*గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి

ఏప్రభుత్వాలు చేయనంత అభివృద్ధిని
బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని, పినపాక నియోజక వర్గం లో అనేక అబి వృద్ధి సంక్షేమపథకాలను అందించిన ఘనత తనకు ఉందని పినపాక నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగకాంతారావు అన్నారు. శనివారం మండలంలో కాచనపల్లి, జగ్గుతండా, గుండాల, జగ్గాయిగూడెం , చెట్టుపల్లి, దామర్గు, లింగగూడెం, రోల్లగడ్డ గ్రామాల్లో రోడ్ల ద్వార ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి విచ్చేసిన రేగ కాంతారావుకి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ పనిచేసేవారికే పట్టం కట్టాలని, తాను చేసిన అభి వృద్ధిని చూసి మరోసారి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపి స్తానని అన్నారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక రూపంలో ప్రభుత్వ
సంక్షేమ పథకాలు అందాయన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేశారని మరోసారి బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాటల గారడిలతో కాంగ్రెస్ పార్టి ప్రజలను మభ్యపెట్టేందు నాన తంటాలు పడుతుందని, వారిమాయ మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ప్రచార కార్యక్రమంలో కోలేటి భవాణి శంకర్, తెల్లం బాస్కర్,టీ రాము, మోకాళ్ళ వీరస్వామి, నిట్టా రాములు, అటికం నాగేశ్వరావు, పాయం నరసింహారావు, అజ్జు, గడ్డం వీరన్న, గడ్డం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version