నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన పాలమూరు బీజేపీ ఎంపీ.అభ్యర్థి డీకే అరుణ..

మహబూబ్నగర్ జిల్లా ::నేటి ధాత్రి

భారతీయ జనతా పార్టీ పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి భారీ జన సందోహం తో పాలమూరు జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలతో పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు కలెక్టర్ కు సమర్పించారు. కళాకారులు ఆటపాటలతో అప్పుల మోతల మధ్య బిజెపి నినాదాలతో పాలమూరు మారుమోగింది. డీకే అరుణకు దారి పొడవునా పట్టణ ప్రజలు శుభాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి భారీ ఎత్తున నాయకులు అభిమానులు తరలివచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *