రైతు భరోసా నిధులు ఆపిన తోడు దొంగలు బీజేపీ, బిఆర్ఎస్

– బీజేపీ రైతుల ఖాతాలో పడ్డ నిధులను ఆపేలా కుట్రలు
– డిసిసి అధ్యక్షులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 7(నేటి ధాత్రి):
తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు నిధులను తమ ఖాతాలో వేయడాన్ని బిజెపి ఓర్చుకోవడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.. ఈ సందర్భంగా ప్రెస్ నోట్ విడుదల చేశారు… రైతు భరోసా ను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమయానికి రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సమయం కంటే ముందుగానే ఒకేసారి రైతు ఖాతాలో డబ్బులు జమ చేసారు. ఈసీ అస్త్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో పడ్డ నిధులను ఆపేలా కుట్రలు చేసిందనీ తెలిపారు. రైతుల నోటికాడి బుక్కును లాక్కుందనీ తెలిపారు. బీజేపీకి మొదటి నుంచి అన్నదాతలు అంటే అక్కసు, ఆగ్రహం. కేంద్రం నల్ల చట్టాలు రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేసింది తెలిపారు. నల్ల చటాలను వ్యతిరేకించి పోరాటం చేసిన వందలాది రైతులను బీజేపీ పొట్టన పెట్టుకుందనీ తెలిపారు.ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత గడ్డు పరిస్థితిలో కూడా నిధులు లేకున్నా అన్నదాతలను ఆదుకోవ డం కోసం బ్యాంకులలో రైతు భరోసా నిధులు జమ చేసామనీ తెలిపారు. ఇప్పుడు బీజేపీ తన గుప్పిట్లో ఉన్న ఈసీ ని అడ్డం పెట్టుకొని బ్యాంక్ ఖాతాలో పడ్డ సొమ్ములను కూడా నిలిపి వేసిందనీ తెలిపారు. ఇంత దారుణం ఎక్కడ ఉండదనీ, బీజేపీ చేస్తున్న కుట్రలను అన్నదాతలు చూస్తున్నారనీ తెలిపారు.
2018 ఎన్నికల సమయంలో ఎన్నికల రోజునే కేసీఆర్ రైతు బంధు డబ్బులు వేశారు.. అప్పుడు నోరుమెదపని బీజేపీ, ఆపని ఈసీ ఇప్పుడు ఎందుకు ఆపింది ? అని ప్రశ్నించారు.రైతు భరోసా కొత్త పథకం కాదు.. గత కొన్ని రోజులుగా క్రమంగా డబ్బులు వేస్తున్నాం. పెండింగ్ ఉన్న డబ్బులు ఇపుడు వేశామని తెలిపారు.గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే నిధులు జమ చెయ్యమని అడిగింది.. రైతుల ప్రయోజనాల కోసం కృషి చేసామనీ తెలిపారు.. వచ్చే ఎన్నికల్లో రైతు వ్యతిరేఖ బీజేపీకి తగిన గుణపాఠం చెపుతారనీ తెలిపారు.రైతు భరోసా నిధులు ఆపిన తోడు దొంగలు బీజేపీ,బిఆర్ఎస్ లను రైతులు రాష్ట్రం నుంచి తరిమి కొడతారనీ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version