తంగళ్ళపల్లి నేటిధాత్రి
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కు నేడు భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో. 2023.. 2024 నుండి..TSEWIDSC.. ద్వారా 11 లక్ష రూపాయలు మంజూరు కావడంతో నేరెళ్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కు భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగిందని తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల జిల్లాఉన్నత పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మంజూరు కావడం గర్వదగ్గ విషయమని దీని ద్వారా విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటూ చదువులో రాణించడం జరుగుతుందని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా పై చదువులకు ముందుకు వెళ్లాలని ఆశిస్తూ గ్రామంలో సైన్స్ లాబ్ రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసి ఆహారం అందించే విధానం నాణ్యతను పరిశీలించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ గ్రామ శాఖ అధ్యక్షులు కోల శంకర్ ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్ మాజీ ఎంపిటిసి బై రీ నేని రాము నేరెళ్ల మాజీ సర్పంచ్ మంజుల మల్లేశం ఏఎంసీ డైరెక్టర్లు ఎంపీటీసీలు సర్పంచులు ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు