భద్రాచలం నేటి దాత్రి
ఈరోజు భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి స్థాయికి రావాలని తెలిపారు. నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకొని డాక్టర్ అయి ప్రజలకు సేవ చేస్తున్న అని తెలియజేశారు
ప్రజలందరి ఆశీసులతో ఇప్పుడు ఎమ్మెల్యే అయి మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు
విద్యార్థులందరికీ విద్యతో పాటు టైం కి భోజనం సదుపాయాలన్ని అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భోగాల శ్రీనివాస్ రెడ్డి, భీమవరపు వెంకటరెడ్డి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు