సుభాష్ నగర్ కాలనీలో పర్యటించిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు భద్రాచలం సుభాష్ నగర్ కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని తెలుసుకొని పరిష్కరించడానికి భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు సందర్శించారు.

సుభాష్ నగర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం శిధిల అవస్థ పరిస్థితిలో ఉండటానికి చూసి వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడి మరమ్మత్తు పనులు ప్రారంభించడం ఆదేశించారు

కాలనీలో ప్రజలు రోడ్లు మరియు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని విన్నవించుకోగా , నూతన రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని తెలియజేయగా వెంటనే గ్రామపంచాయతీ అధికారులతో మాట్లాడి పూడిక తీయాలని, నూతన రోడ్లు , డ్రైనేజీలు నిర్మించాలని ఆదేశించారు.

ఖాళీ స్థలాల్లో మొలిచిన పిచ్చి మొక్కల వలన దోమలతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తెలియజేయగా వెంటనే ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఈవో గారితో మాట్లాడి జెసిబి ని తెప్పించి మొక్కలు తీసివేత ప్రారంభించారు…

కరకట్టకు ఆనుకొని ఉన్న నివాసాలకు కరెంటు స్తంభాలు లేవని, లో వోల్టేజ్ సమస్య ఉందని తెలియజేయగా వెంట ఉన్న కరెంటు ఏఈ తో మాట్లాడి లోవర్ డే సమస్య లేకుండా అవసరమైతే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయమని ఆదేశించారు. అలాగే కొత్త కరెంటు స్తంభాలు పది రోజులలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు కొరత ఉందని తెలియజేయగా వెంట ఉన్న మిషన్ భగీరథ ఏఈ ని‌ వివరణ అడగగా సమస్య ఉందని చెప్పి దానిని వెంటనే పరిష్కరిస్తానని తెలియజేశారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కి కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు

ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, రత్నం రజనీకాంత్, ఎండి నవాబ్, పెద్దినేని శ్రీనివాస్, నర్రా రాము, అరికెల తిరుపతిరావు, మామిడి పుల్లారావు, B. వెంకటరెడ్డి, ఎండి ఖాసింబి, చెగొండి శ్రీనివాస్, సరెళ్ళ నరేష్,‌ దొడ్డిపట్ల కోటేష్, క్రాంతి యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version