బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి

ఎమ్మార్వో కు వినతి పత్రం సమర్పించిన ధర్మసమాజ్ పార్టీ

గంగాధర నేటి ధాత్రి :

బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ధర్మసమాజ్ పార్టీ డిమాండ్ చేశారు. గురువారం రోజున గంగాధర మండల డిప్యూటీ తాహసిల్దార్ వినయ్ కుమార్ ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల రవి వినతి పత్రం అందజేశారు. అనంతరం రవి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని,
రాష్ట్రంలో కోటి మంది ప్రజలకు విద్యా వైద్యం ఉపాధి ఇల్లు భూమి ఈ ఐదు సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారని అన్నారు.
రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని,ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రతి గ్రామంలో ఆధునిక ఆసుపత్రిని నిర్మించాలని, ప్రజలందరికీ గౌరవ ప్రదమైన ఉపాధిని కల్పించాలని,అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యం ఉన్న ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలని,అర్హులైన వారందరికీ రోడ్డు వందల గజాలు నాలుగు గదులు ఇల్లు నిర్మించలనిbఈ ఐదు పథకాలకు మహాత్మ ఫూలే, అంబేడ్కర్, సాహు మహారాజ్, కాన్షీరామ్ మహనీయుల పేర్లు పెట్టి ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసినప్పుడు మాత్రమే పేద ప్రజల జీవితాల్లో సామాజిక సాంస్కృతిక ఆర్థిక మార్పు ను తీసుకురావాలని ప్రభుత్వాన్ని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రభుత్వం, అమలు చేయని పక్షంలో మండల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అన్నారం బాబు గంగాధర మండల అధ్యక్షుడు నరేష్. రమేష్. రఘు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version