హనుమకొండ/వరంగల్, నేటిధాత్రి (న్యాయ విభాగం):-
తేది 27-12-2024 రోజున భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ టెన్ కోర్ట్స్ కాంప్లెక్స్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ హాల్లో జరిగినది. ఇట్టి సంతాప సభను హనుమకొండ, వరంగల్ ఇరు బార్ అసోసియేషన్ అధ్యక్షులైన మాతంగి రమేష్ బాబు, టి. జీవన్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగినది ఇట్టి కార్యక్రమం లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో చాలా మంది సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తన అపారమైన జ్ఞానంతో, సమగ్రత తో దేశాన్ని నడిపించారని మరియు తను దేశానికి చేసిన సేవలను కొనియాడారు మరియు అతని మృతి దేశానికి పెద్ద తీరని లోటని అన్నారు. ఇట్టి సమావేశంలో ఇరు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ మరియు సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు.