సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా రెండోసారి బందు సాయిలు ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

ఈనెల 21,22 తేదీల్లో భూపాలపల్లి కృష్ణ కాలనీలోని సింగరేణి ఫంక్షన్ హాల్ లో సిపిఎం జిల్లా 3వ మహాసభలు నిర్వహించడం జరిగింది. ఈ మహాసభల కి కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు జే వెంకటేష్ హాజరయ్యారు. గత మూడు సంవత్సరాల కాలంలో నిర్వహించిన పోరాటాలని సమీక్షించాము. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద సమరసిల పోరాటాలకు ప్లాను రూపొందించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం సిపిఎం పార్టీ డిసెంబర్ నెలలో ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహించాలని, మహాసభలో తీర్మానించాము. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సిపిఎం పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది రెండోసారి జిల్లా కార్యదర్శిగా బంద్ సాయిలు ఎన్నికయ్యారు
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గా చెన్నూరి రమేష్, పొలం రాజేందర్ ,గుర్రం దేవేందర్ ఎన్నికైనారు.
జిల్లా కమిటీ సభ్యులుగా వెలిశెట్టి రాజయ్య, ఆత్కూరి శ్రీకాంత్ , సంగం ప్రీతి, రజనీకాంత్ ,సూదుల శంకర్, పోలం చిన్న రాజేందర్, కుంజం బుధవారం,ఆకుదారి రమేష్, వంగాల విజయలక్ష్మి, గడప శేఖర్ లు ఎన్నికయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version