రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించినందుకు 15 వ వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన బండారు

వనపర్తి నేటిదాత్రి –
వనపర్తి పట్టణంలో 15వ వార్డు లో పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించినందుకు 15వ వార్డు ప్రజల తరఫున అధికారులకు ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డికి నేటి ధాత్రి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు వర్షం వస్తే ఒక సైడు బీటీ రోడ్డు వెయ్యనందుకు ప్రమాదకరంగా ఉండడంతో 15 అవార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ నేటి ధాత్రి దినపత్రిక దృష్టికి తీసుకపోవడంతో అధికారులు ఎమ్మెల్యే స్పందించి విస్తరణ పనులు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు బండారు మాట్లాడుతూ జెర్రిపోతుల మైసమ్మ నుండి రామా టాకీస్ కొరకు 45 కోట్లతో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి నిధులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేయంచారని అట్టి నిధులతో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని అన్నారు . ఓల్డ్ యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర డివైడర్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు రామా టాకీస్ ఎదురుగా శ్రీ సాయి ఎలక్ట్రికల్ నుండి ఓల్డ్ యూకో బ్యాంకు క్రాసింగ్ వరక

కొంత భాగం డాం బర్ రోడ్డు వేయకుండా వదిలి వేశారని ఇట్టి రోడ్డును పూర్తిచేయాలని బండారు అధికారులను ఎమ్మెల్యేను కోరారు
గురువారం నాడు రోడ్ల విస్తరణ పనులను మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పరిశీలించార ఈ కార్యక్రమంలో
న్యాయవాది అయిత కృష్ణ మోహన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చీర్ల శ్రీనివాసులు ఠాగూర్ పాపిశెట్టి శ్రీనివాసులు బండారు రాజు వార్డు ప్రజలు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version