నల్గొండజిల్లా, నేటి దాత్రి :
నల్గొండ జిల్లా పరిధిలో ఈ నెల 14 వరకు కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే DJలతో సహా అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్ల వినియోగంపై నిషేధం విధిస్తూన్నట్లు జిల్లా ఎస్పి గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో డీజేలు నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా మానవ ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు పడుతున్న కారణంగా నిషేధించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిక శబ్ధం కలిగించే డిజే లను వినియోగించ రాదని అన్నారు.
ఈ నిషేధ ఉత్తర్వులను చట్టాన్ని ఉల్లంఘించి, ఎవరైనా వినియోగిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు.
