మృతురాలి కుటుంబానికి బాలకిషోర్ రెడ్డి ఆర్థిక సహాయం.

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :

దుఃఖ సముద్రంలో ఉన్న నిరుపేద కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాడు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు,సామాజిక వేత్త అల్లం బాలకిషోర్ రెడ్డి. గీసుకొండ మండలం నంద నాయక్ తండలో శుక్రవారం అనారోగ్య కారణాలతో బాధావత్ కమలమ్మ అనే మహిళా మృతి చెందింది.సమాచారం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకుడు అల్లం బాలకిషోర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు అల్లం మర్రెడ్డి చేతుల మీదుగా 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.అమే అంత్యక్రియల్లో పాల్గొన్న వారు కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమగాని సౌజన్య గౌడ్, జిల్లా నాయకులు చాడ కొమరారెడ్డి, సాయిలి ప్రభాకర్, మండల నాయకులు కుసం రమేష్,మాదాసి రాంబాబు,గ్రామ పార్టీ అధ్యక్షులు నరేష్,నరసింహ, చెవుల నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *