రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్ లో వినాయక మండపాల నిర్వాహకులతో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఎస్సై వి.శేఖర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి గొడవలు లేకుండా రాత్రి తోమ్మిది గంటలలోపు నిమజ్జనాలు పూర్తి చేసుకోవాలని, డీజేలను వాడవద్దని, మంటపాల వద్ద విద్యుత్తు వైర్లను ముట్టుకోకుండా పలు జాగ్రత్తలను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఈకార్యక్రమంలో ఎస్సై శేఖర్, పోలీస్ సిబ్బంది మండపాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.