వైద్యాధికారి అమరేందర్ రావు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం లోనీ హారిపురం గ్రామం లో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు హోమియో వైద్యాధి కారి శ్రీవాణి గ్రామ పంచాయితీ సర్పంచ్ సంపత్ రావు సూచన మేరకు సీజనల్ వ్యాధులు ప్రబులుతున్న దృశ్య మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించినారు. ఈ సందర్బంగా వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ దీనిలో భాగంగా ఒపి గా 98 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో కొందరికి జలుబు దగ్గు కొంత మంది కి జ్వరాలు ఉన్నవారికి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి టీ హబ్ పెద్దపల్లి పంపుతూ మందులు పంపిణీ చేయడం జరిగినది . బ్లడ్ శాంపిల్స్ రిపొట్ వచ్చిన తర్వాత పి ఎచ్ సి రమ్మని తెలిపారు అందరూ తమ తమ ఇళ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని దోమల బారినుండి కాపాడు కొనడానికి దోమ తెరలు వాడాలని . నీటిని ఎక్కువ రోజులు నిల్వ చేయకుడ దని . ఇంటి అవరణ లో చెత్త నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలని ఆరోగ్య విద్య బోధన చేయడం జరిగినది అని అన్నారు ఈ కార్యక్రమం లో ఎమ్ ఎల్ ఎచ్ పి దీప్తి, ఎచ్ ఈ ఓ నర్సింహారెడ్డి , పి ఎచ్ ఎన్ లలిత సూపర్ వైజర్స్ వీరేషం పశుల శ్రీనివాస్ ఏ ఎన్ ఎమ్ రమ,కళావతి, ఆశలు రాజేశ్వరి, రజిత, శశికల పాల్గొన్నారు.