డిఇఎ ఫండ్ స్కీమ్ ద్వారా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణ కేంద్రంలో శ్రీ ధరణి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కళ్లేపు శోభారాణి ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా వారి డిఇఎ ఫండ్ స్కీమ్ ద్వారా స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలకు, రైతులకు ఆర్థిక అక్షరాస్యత పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ శ్రీదర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపైన పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొవాలన్నారు. సామాజిక భద్రత పథకాలైన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను బ్యాంక్ ఖాతాదారులు వినియోగించు కోవాలని సూచించారు. బ్యాంక్ నుండి ఋణం పొందాలంటే అందరు సరైన సిబిల్ స్కోర్ ని కలిగి ఉండాలని అలాగే సైబర్ మోసాల పట్ల ఖాతాదారులందరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనవసరమైన ఖర్చులు తగ్గించికొని అధిక మొత్తంలో డబ్బుని పొదుపు చేసుకొవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ ఎఫ్ఎల్ సి వరంగల్ జిల్లా కో’ ఆర్డినేటర్ టి. భాస్కరా చారి, శ్రీ ధరణి సంస్థ కో ఆర్డినేటర్ ఈదునూరి రమేష్, సిఎలు మాస్ సునీత, మహిళా సంఘాల ప్రతనిధులు శైలజ, జ్యోతి, రైతు సంఘాల ప్రతినిధులు గంగాధర్, తిరుపతి, ఈ. స్రవంతి కళాకారులు ఎం. శ్రీశైలం, సందీప్ ప్రముఖ యువజన సంఘాల ప్రతినిధులు కే. గణేష్, ప్రణీత, రాఘవ,మరియు స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version