ఏడిఈ శ్రీనివాస్ యాదవ్
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్ర విద్యుత్ శాఖ సిఎండి వరుణ్ రెడ్డి ప్రవేశ పెట్టిన పొలం బాట ప్రోగ్రాం ను భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి లోని కాసిం పల్లె గ్రామం చల్లూరి పల్లి శివారు లో భూపాలపల్లి ఏడిఈ శ్రీనివాసు యాదవ్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రెండు 100 కెవిఏ ట్రాన్స్ఫార్మర్ లకి చెడిపోయిన AB SWITCH, HG FUSE SET అండ్ LT FUSE SET లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడం జరిగింది వదులుగా ఉన్న లైన్ లో 9 మధ్య స్థంబాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడిఈ శ్రీనివాసు యాదవ్ మాట్లాడుతూ రైతుల సమస్యల పై ఆరా తియ్యడం జరిగింది. అలాగే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్త లపై అవగాహన కల్పించడం జరిగింది. విద్యుత్ మోటర్లకు కెపాసిటర్ పెట్టుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతుల కు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏడిఈ శ్రీనివాసు యాదవ్, భూపాలపల్లి టౌన్ సబ్ ఇంజనీర్ రణధీర్, కాసింపల్లె లైన్ మెన్ బాబా సాదిక్ హైదర్, కాశింపల్లె జెఎల్ ఎం హరిచంద్ర రైతులు రాయ కొమురు కొత్త సతీష్, దుర్గం మల్లయ్య, సుంకరి ఓదెలు, కొత్త చంద్రయ్య, నలిగేటి సతీష్, కొత్త మల్లయ్య, చిత్తరి చంద్రయ్య , చిత్తారి తారయ్య మరియు బౌత్ లింగయ్య పాల్గొన్నారు.