సిసి కెమెరాలపై గ్రామస్తులకు అవగాహన

గ్రామ రక్షణకై 40 సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తుల సహకారం

చిట్యాల సిఐ మల్లేష్

మొగుళ్లపల్లి నేటి ధాత్రి :
మండలంలో కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా. మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై బొరగల అశోక్ ఆధ్వర్యంలో. నేను సైతం సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమంపై అవగాహన సదస్సును గ్రామస్తులకు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధిగా చిట్యాల సీఐ మల్లేష్ పాల్గొని మాట్లాడుతూ. నేనుసైతం సీసీ కెమెరాల ఏర్పాటు అవగాహన కార్యక్రమానికి గ్రామస్తులు రావడం ఆనందంగా ఉందని, మన గ్రామంలో ఎలాంటి నేరాలు జరుగకుండా ఉండేందుకు గాను సిసి కెమెరాల ఏర్పాటు ఎంతగానో దోహదపడుతుందని, నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం కాబట్టి, గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటు చేశామంటే నేరలను నిరోదించినట్టేనని 24/7 సీసీ కెమెరాలు వాటిపని నిర్వర్తిస్తూనే ఉంటాయని. నేరం చేసిన వారిని తక్కువ సమయంలో గుర్తించి నేరస్తున్ని పట్టుకోవడంలో సీసీ కెమెరాల పనితిరు అమోగమని. మొగుళ్లపల్లి గ్రామానికి నిఘా నేత్రాలను ఏర్పాటు చేసేందుకు మీ అందరి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని గ్రామస్తులకు సూచించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ. కట్టుదిట్టమైన భద్రత సీసీ కెమెరాల ద్వారానే అని అవగాహన సదస్సులో సీఐ మాటల ద్వారా గ్రహించిన గ్రామస్తులు, 40 సీసీ కెమెరాలు గ్రామ రక్షణకు ఏర్పాటు చేసేందుకు మేము సైతం సహాయం అందిస్తామని చిట్యాల సీఐ మల్లేశ్, మొగుళ్లపల్లి ఎస్సై బి అశోక్ కు గ్రామస్తులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో. పిఏసిఎస్ చైర్మన్. సంపెల్లి నర్సింగారావు, మాజీ సర్పంచ్ మోటె ధర్మారావు, ఏలేటి శివారెడ్డి, నడిగోటి రాము, క్యాతరాజు రమేష్, మహ్మద్ రఫీ, ఏలేటి ప్రభురెడ్డి వ్యాపారస్థులు, వాహన యూనియన్ నాయకులు, వివిధ రంగాలలో పనిచేస్తున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version