మల్కాజిగిరి,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రద్దు చేసి ఆటో మీటర్ల ఛార్జ్ లు పెంచాలని శుక్రవారం ఏ ఐ టి యు సీ మల్కాజిగిరి ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.ప్రభుత్వం మహిళలకు అండగా ఉండాలని ఎంతో కృతనిచ్చయంతో ప్రారంభించిన ఉచిత బస్సు సౌకర్యం ను రద్దు చేయాలని మల్కాజిగిరి లో ఒకరోజు ఆటో బంద్ నిర్వహించి ఆటో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యం,ఓలో క్యాబ్ తొలగించాలి మీటర్ చార్జీలు పెంచాలని ముఖ్యమంత్రి ని కోరారు.ముఖ్యమంత్రి సంవత్సరం కు 12 వేలు ఇస్తానన్నవి,అటో డ్రైవర్ లకు నెలకు 12 వేలు ఇవ్వాలని కోరారు.