ఆటో క్యాబ్ ప్రైవేటు మోటార్స్ డ్రైవర్స్, వర్కర్స్ రాష్ట్ర 3వ మహాసభను జయప్రథంచేయండి

భద్రాచలం నేటి ధాత్రి

రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య- భద్రాచలంలో ప్రారంభమైన జీపుజాత

ఈ నెల 22,23 తేదీల్లో జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో జరిగే ఏఐటియూసి అనుబంధ రాష్ట్ర ఆటో క్యాబ్, ప్రైవేటు మోటార్స్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 3వ మహాసభను జయప్రథం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య అన్నారు. మహాసభల విజయవంతాన్ని కోరుతూ సోమవారం బస్టాండ్ అవుట్ గేట్ ఆటో వద్ద పోస్టర్ ఆవిష్కరించి జీపు జాతా ప్రారంభించారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితబస్సు రవాణా సదుపాయం కల్పించడం ద్వారా ఆటోకార్మికులు బ్రతుకులు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లాయని తెలిపారు. ఎన్నిక మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా క్యాబ్, ఆటో కార్మికులను ఆదుకోవాలన్నారు. ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి నేటీకి అమలు చేయకపోవడం అన్యాయమని, వెంటనే ఆ నిధులను విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలన్నారు. రవాణా రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, గ్రేటర్ హైదరాబాద్లో 20 వేల కొత్త ఆటోలకు పర్మీషన్లు ఇవ్వాలని, ఓలా,
ఊపర్, ర్యాపిడో ద్వారా అక్రమంగా నడుస్తున్న టూ వీరల్ వెహికిల్ నిషేదించాలని, ఆటోక్యాబ్మటర్ చార్జీలు పెంచాలని, ప్రమాదబీమా రూ.10 లక్షలకు పెంచి సాధారణ మరణాలకు కూడా వర్తింపచేయాలని, మహాలక్ష్మీ పథకం ద్వారా నష్టపోయిన ఆటోలకు థర్ట్ పార్టీ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, 2019 మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని, మహాలక్ష్మీ పథకం ద్వారా నష్టపోయిన ఆటో కార్మికులకు నెలకురూ.12 వేలు చెల్లించాలని అన్నారు. అన్ని రంగాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వం ఆటో కార్మికులను విస్మరించడం సరైంది కాదన్నారు. ఆటో కార్మికులు కుటుంబాలు నష్టాల్లో కూరుకుపోయాయని, పిల్లలకు బడి ఫీజులు కూడా కట్టించుకుని కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జరగబోయే మహాసభకు ముఖ్యాతిధిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ కూనంనేని సాంబశివరావుతో పాటు ఏఐటియూసి జాతీయ నాయకులు విఎస్ బోస్, రాష్ట్ర ప్రథాన కార్యదర్శి బాలరాజు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు, జిల్లా గౌరవాధ్యక్షులు సాబీర్ పాషా, యూనియన్ ప్రథాన కార్యదర్శి బి వెంకట్, ఏఐటియూసి జిల్లా ప్రథాన కార్యదర్శి నరాటిప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాలవిశ్వనాధం, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కల్లూరి వెంరటేశ్వరరావు తదితరులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ మహాసభ వేదికగా ప్రభుత్వానికి కార్మికుల సమస్యలను వివరించేందుకు పెద్ద ఎత్తున కార్మికులు కదిలి రావాలని కోరారు. అనంతరం ఇన్టేట్ అడ్డా, మార్కెడ్ అడ్డా, ట్యాక్సీ అడ్డాలో కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియూసి జిల్లా కార్యదర్శి నరాటి ప్రసాద్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, ఆఫీస్ బేరర్స్ కె వెంకటేశ్వర్లు, వేల్పుల మల్లిఖార్జున రావు, సిపిఐ పట్టణ నాయకులు సాధనపల్లి సతీష్, కంబంమెట్టు శ్రీనివాస్, చిట్టిపోతుల కృష్ణయ్య, అశోక్ కుమార్, పితాని మనస్సే, కవిటపు మోహన్, నాగు, శేఖర్, క్రాంతి, సురేష్, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version