చిట్యాల, నేటిధాత్రి :
సోమవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబ్ పేట గ్రామానికి చెందిన నేరేళ్ళ సమ్మయ్య తండ్రి రాజపోషయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించినాడని తెలుపుటకు చింతిస్తున్నాము. మృతుని కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ* ఆధ్వర్యంలో పరమార్శించి మృతుని చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు . అనంతరం సంతాపం తెలిపి ,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ మండల నాయకుడు గుర్రం అశోక్ ధర్మ సమాజ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నేరేల్ల రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.