అరుణమ్మ గెలుపు పాలమూరు ప్రజల పిలుపు..

ట్రిపుల్ తలాఖ్ రద్దు తో మైనారిటీ మహిళల జీవితాల్లో వెలుగులు..

బిజెపి,ముస్లిం లకు వ్యతిరేఖ పార్టీ కాదు..

ముస్లిం మహిళలు అంతా మోదీని ఆశీర్వదించాలి..

అరుణమ్మ కు మద్దతుగా మహబూబ్ నగర్ లో మైనారిటీ మహిళల ర్యాలీ..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ట్రిపుల్ తలఖ్ రద్దు తో ముస్లిం మైనారిటీ మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరుణమ్మ. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆల్మస్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ మహిళల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మైనారిటీల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించారు.

అరుణమ్మకు మద్దతుగా మైనారిటీ మహిళల ర్యాలీ..

పాలమూరు పార్లమెంట్ పరిధిలో బీజేపీ రోజు రోజుకు బలపడుతోంది. ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థి అరుణమ్మ కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతుంటే… తాజగా మోదీ ప్రభుత్వం తీసుకున్న ట్రిపుల్ తలాఖ్ రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. అరుణమ్మకు మద్దతుగా పట్టణంలో మైనారిటీ మోర్చ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
టీటీడీ కల్యాణమండపం నుంచి ఆల్మస్ ఫంక్షన్ హాల్ వరకు సాగిన ఈ ర్యాలీలో జై బీజేపీ, జై అరుణమ్మ నినాదాలతో హోరేత్తించారు.

అరుణమ్మ కామెంట్స్..

ఇవి దేశంలో ప్రధాని ఎవరో నిర్ణయించే ఓట్లు

గత పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనపై విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు..

కానీ బిజెపి ప్రజా సమస్యల పై పోరాటం చేసి బి ఆర్ ఎస్ అవినీతిని బయటపెడితే.. గుడ్డిలో మెల్ల లా కాంగ్రెస్ గెలిచింది.

కోట్ల మోదీ పరివారం ఈ దేశంలో ఉంది.

బీజేపీ కి, మోదీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, బి ఆర్ ఎస్ లు
బీజేపీ ముస్లింల వ్యతిరేఖ పార్టీ అని ముద్ర వేస్తున్నారు.

కానీ ఈ దేశంలో లో మైనారిటీ ల సంక్షేమం కోసం పాటుపడుతున్నది మోదీ నే.

నిరుపేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా నిరుపేదల కోసం అన్ని రకాల సంక్షేమ పతకాలు అమలు చేస్తున్నారు.

పాలమూరులోని మైనారిటిలకు రేషన్ కార్డు ఇప్పించడంతో పాటు…మరో అయిదేళ్ల పాటు ఉచితంగా బియ్యం ఇప్పిస్తాను.

మీ జీవితాల్లో వెలుగులు నింపాం

ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కల్పించింది మోడీనే.

ఇలాంటి హింస లేకుండా 371 ఆర్టికల్ రద్దు చేసింది మేమే.

అబ్ వక్త్ ఆగయా

ముస్లింల వ్యతిరేఖ పారీ అనే ముద్రను చేరిపేస్తూ.. ట్రిపుల్ తలాఖ్ రద్దు చేసి మీ జీవితాల్లో వెలుగులు నింపిన మోదీ ఋణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది అన్నారు. అరుణమ్మ.
వచ్చే నెల 13న జరిగే పోలింగ్ లో భారీగా కమలం గుర్తుపై ఓటు వేసి, భారీ మెజారిటీ తో గెలిపించాలని జిల్లా ప్రజలను కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version