మేల్లచేరువు పోలిస్ స్టేషన్ నందు ఎన్డిపియేస్ యాక్ట్ కింద కేసు నమోదు.
హుజూర్ నగర్,నేటిధాత్రి.
జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు.
– విద్యార్థులు వ్యసనాలకు అలవాటు పడవద్దు.
– మంచి భవిష్యత్తు కోసం లక్ష్యం పెట్టుకొని కష్టపడాలి.
రాహుల్ హెగ్డే ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
ఈరోజు మేళ్ళచెరువు పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ఐ, మారియు సిబ్బంది రేవూరు రోడ్డు నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక విద్యార్థి వద్ద కొంత గంజాయి లభించినది, అతని సమాచారం మేరకు నిఘా ఉంచి జగ్గయ్యపేటకు చెందిన బొజ్జగాని రోహిత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకోవడం జరిగినదని, అతని వద్ద 120 గ్రాముల గంజాయి గుర్తించి సీజ్ చేశాము అని ఎస్పి గారు తెలిపినారు. విద్యార్థి పై, సరఫరా చేసే వ్యక్తి పై ఇరువురిపై ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగినది.
జిల్లాలో గంజాయి వినియోగించే వారి, అమ్మే వారి, సరఫరా చేసే వారి పూర్తి సమాచారం ఉన్నది, అందరిపై నిఘా ఉంచాం. గంజాయి సరఫర అమ్మకం, త్రాగటం నేరం ఈ రకమైన నేరానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం, గంజాయి వల్ల యువత భవిష్యత్తును కోల్పోతున్నారు అన్నారు.
గ్రామీణ యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి, చిన్న చిన్న ప్యాకెట్ లలో గ్రామాలకు గంజాయి తెచ్చి యువతకు, విద్యార్థులకు అలవాటు చేసి తర్వాత అధిక ధరలకు విక్రయిస్తారు, ఇలాంటి వారి మాయలో పడొద్దు, గంజాయి మత్తుకు బానిసలు కావద్దు. తల్లిదంద్రులు, ఉపాద్యాయులు విద్యార్థుల, మీ పిల్లల అలవాట్లను గమనించండి, వారు తప్పుదోవ పట్టకుండా చూడండి, గంజాయి నిర్మూలనలో పోలీసు వారితో సహకరించి సమాచారం అందించి, మీ పిల్లల భవిష్యత్తును కాపాడాలని అని ఎస్పి గారు అన్నారు.
గంజాయి పట్టుబడి చేయడంలో బాగా పని చేసిన ఎస్ఐ సిబ్బందిని అభినందిస్తున్నాను అని ఎస్పి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ రాము, మెల్ల చేరువు ఎస్ఐ పరమేష్ ఉన్నారు.