ప్రిన్సిపాల్ స్వర్ణ రత్న.
వెల్దండ / నేటి ధాత్రి.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలలో 5వ తరగతి ప్రవేశ పరీక్ష మరియు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష ఉంటుందని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణ రత్న బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.