#ఎం సిపిఐ ( యు) మండల కార్యదర్శి దామ సాంబయ్య.
#మండలంలో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు..
# మేడే జెండాలను ఆవిష్కరించిన కార్మికులు, నాయకులు..
నల్లబెల్లి,నేటిధాత్రి :
పెరిగిపోతున్న దోపిడీ మతోన్మాద నియంతృత్వ విధానాలకు ప్రత్యామ్నాయం కేవలం ఎర్రజెండానే అని ఆ దిశలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని ప్రజలు వామపక్ష సామాజిక శక్తులను ఆదరించాలని అప్పుడే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని ఎంసిపిఐ(యు) మండల కార్యదర్శి దామ సాంబయ్య అన్నారు.బుదవారం138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ను పురస్కరించుకొని ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ, పార్టీ కార్యాలయం వద్ద ఎర్రజెండాలనా ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున కార్మిక ఐక్యతను చాటుతూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనే నినాదాన్ని పునికిపుచ్చుకొని శ్రమజీవుల శ్రమను దోచుకుని అందరికీ చెందాల్సిన సంపదను కొంతమంది దక్కించుకొని అసమానతలు కారణమవుతున్న దోపిడీ పాలకులకు పెట్టుబడుదారులకు వ్యతిరేకంగా మే డే స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను చేపట్టాలని ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మతోన్మాదులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్మికులు కర్షకులు కూలీలు శ్రమకు తగిన ఫలితం పంటలకు గిట్టుబాటు ధర నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలీరేట్ల కోసం ఎర్రజెండా నీడన ఐక్యంగా పోరాడాలని కోరారు. ఆక్రమణ గురవుతున్న ప్రభుత్వ భూముల రక్షణకు నిలువ నీడలేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇండ్లు కనీస అవసరాల కోసం చిత్తశుద్ధితో పోరాడేది కేవలం ఎర్రజెండా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది కామ గాని దిలీప్, నూనె లింగయ్య, సుదర్శన్, చిన్న, ఐలయ్య, సాల్మన్, స్వప్న, సంపూర్ణ, హమాలీ సంఘం నాయకులు బాబు, సాగర్,తదితరులు పాల్గొన్నారు.