లక్షేటిపేట (మంచిర్యాల) నేటిదాత్రి;
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజంపేట గ్రామంలో వ్యవసాయ బావి తగ్గుతుండగా పురాతన రాముడు విగ్రహం బయటపడింది. రైతు ఆ విగ్రహాన్ని బయటకు తీసి పూజలు నిర్వహించాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు రాముల వారి విగ్రహాన్ని చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ అయోధ్య రామయ్య గుడి నిర్మాణ సందర్భంలో రాముల వారి విగ్రహం బావిలో బయటపడడం ఆనందంగా ఉందని తెలిపాడు. రాజంపేట గ్రామస్తులందరూ సాయంత్రం భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించి, రాములవారి గుడి నిర్మిస్తామని తెలియజేశారు