యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్ రాజ్ కుమార్
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ దుగుట రాజ్ కుమార్. అతి చిన్న వయసులోనే సర్పంచి పదవి చేపట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ గ్రామంలో ఒక దేవాలయాన్ని కూడా నిర్మించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఊరు మధ్యలో ఏర్పాటు చేసి అంబేద్కర్ ఆశయాలు గుర్తు చేస్తూ యువత చెడు మార్గంలో వెళ్లకుండా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత, మరియు వివిధ కుల సంఘాలు, నాయకులు, అధికారులు,ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు