పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య

జనగామ, నేటిధాత్రి:-
పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం జనగామ జిల్లా ఆఫీసులో గంగాపురం మహేందర్ అధ్యక్షతన జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని, పేదల గుడిసెలు వేసుకున్న చోట పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం పక్కా ఇల్లు కట్టించాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ప్రభుత్వం పక్కా ఇల్లు కట్టించాలని వారన్నారు. భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తూ ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి ఉపాధిహామీ వందరోజుల పని దినాన్ని 200 పెంచుతూ రోజువారి వేతనం ఎలాంటి కొలతలు లేకుండా 800 రూపాయలకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు పోత్కనూరి ఉపేందర్, పోలాస కిష్టయ్య, గోసంగి శంకరయ్య, సంఖ్య రామ్, నాగేష, మమత, సుధా, రజిత, యాకన్న,కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *