మలహర్ రావు. నేటిధాత్రి:
అఖిల భారత యాదవ సంఘం నాయకుల ఆధ్వర్యంలో కొయ్యూరు ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ మండలంలో అఖిల భారత యాదవ సంఘం మండల అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని ఇట్టి ఎన్నిక జిల్లా అధ్యక్షులు మేకల సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో 25-09-2024 రోజున ఉదయం 11 గం లకు ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల యాదవ కుల సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనవాల్సిందిగా యాదవ సంఘ నాయకులు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సీనియర్ నాయకులు యాదన్న రామన్న యాదవ్, బోయిని రాజయ్య యాదవ్, కొడారి బాబు యాదవ్, యాదన్న గట్టయ్య యాదవ్, సిద్ది శంకర్ యాదవ్, పొన్నాల రాజయ్య యాదవ్, కడారి మల్లేష్ యాదవ్, ఇట్టవెన శరత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
