ఉద్యమకారులకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఆకుల సాంబారావు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటం చేసి పోలీస్ కేసులుకు గురి అయిన ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి ప్రశంస పత్రాలను రాష్ట్ర ఫోరం ఉపాధ్యక్షుడు ఆకుల సాంబరావు ఉద్యమకారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 చదరపు గజాల ఇంటి స్థలం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, నెలకు 25 వేల పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా ఈనెల 27, 28 తేదీలలో కరీంనగర్ నుండి వేములవాడ రాజన్న సన్నిధి వరకు ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మహా పాదయాత్రను చేపట్టడం జరుగుతుందని ఈ పాదయాత్రలో ప్రతి ఒక్క ఉద్యమకారుడు పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రశంస పత్రాలు పొందిన ఉద్యమకారులు బట్టు సాంబయ్య, తంగేళ్ల భాస్కర్, కొత్తగట్టు ప్రభాకర్, పరికి నవీన్, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version