వైఎస్ఆర్టిపి నుండి బీఆర్‌ఎస్‌లో చేరికలు

కండువకప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే చల్లా

పరకాల నేటిధాత్రి(టౌన్)

పరకాల పట్టణానికి చెందిన వై.ఎస్సార్.టి.పి.పార్టీ శ్రేణులు ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు.వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరినవారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఆయనకు అండగా నిలువాలని బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.నియోజకవర్గ అభివృద్ధి ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారికి అండగా నిలిచి.. ఆయన గెలుపుకోసం తమవంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.మహిళా జిల్లా అధ్యక్షురాలు ఏకు కృష్ణవేణి,మహిళా మండల అధ్యక్షురాలు సి.ఎచ్.లావణ్య,ఆటో యూనియన్ అధ్యక్షులు జూపాక ప్రశాంత్,మండల యూత్ అధ్యక్షులు గూడెపు రాజకుమార్ లతో పాటు పలువురు చేరారు.ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ సోడా అనిత రామకృష్ణ,వైస్ చైర్మన్ రేవూరి విజయపాల్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీను,నాయకులు జిన్నా రామకృష్ణ రెడ్డి,బోట్ల నరేష్,ఏకు కార్తిక్,జన్నారపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version