మార్చ్12న హైదరాబాద్ లో ఉద్యమకారుల కృతజ్ఞత సభ..

ఓదెల ( పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

ఓదెల మండల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 12న మంగళవారం రోజున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగిందని కావున జిల్లాలోని ఉద్యమకారులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
స్వరాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను త్యాగం చేసి రాష్ట్రం వచ్చిన తర్వాత అన్యాయానికి గురైన ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి ఉద్యమకారుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని చెప్పడం పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఉద్యమకారులకు రానున్న రోజుల్లో అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు
ఉద్యమకారుల సంక్షేమమే తమకు ముక్యం అని పేర్కొన్నారు.
ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని అన్నారు.
హైదరాబాద్ కు తరలివచ్చి సదస్సు విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు ముద్దామాళ్ళ రమేష్ , కాంతాల సమ్మిరెడ్డి , పెద్దిరెడ్డి రాజిరెడ్డి ,గాజుల శివశంకర్ , అలిగివెల్లి రవీందరరెడ్డి,కర్రే లక్సమారెడ్డి , పాల్కలా కర్ణాకర్ రెడ్డి,తుమ్మల కొండయ్య , మాచర్ల రవీందర్,చింతకుంట వెంకటరెడ్డి , లింగాల జనార్దన్ రెడ్డి,జీలులు సంతోష్ , పంజలా తిరుపతి,కొత్తిరెడ్డి మల్లారెడ్డి, పెరుమాండ్ల ఐలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version