మిరప రైతులకు అనుకూలంగా చర్యలు తీసుకుంటాం.

# త్వరలో మిర్చిపంటల పట్ల మరిన్ని రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం.
# వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
# వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవనశాఖల ఆధ్వర్యంలో మదన్నపేటలో అవగాహన సదస్సు..

#ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో లేరు?

#మిర్చి పంటలో నల్ల పురుగు వల్ల తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాం..

# మిర్చి కొనుగోళ్లలో వ్యాపారులు సిండికేట్?

# అవగాహన సదస్సులో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన రైతులు.

నర్సంపేట నేటిధాత్రి:

మిర్చి పంటలు పండించే రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు, మార్కెటింగ్ విధానంలో అనుకూలంగా ఉండే విధంగా రైతులకు అనుకూలంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
శనివారం వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామ రైతు వేదిక వద్ద మిరప పంటలు,మిరప పంటల కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఏర్పాటుచేసిన రైతు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
పలు సూచనలు చేశారు.అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులు,రైతులతో కలిసి మిర్చి,కూరగాయల పంటలను వ్యవసాయ శాఖ ,ఉద్యానవన శాఖ,మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. గతంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రైతు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పాము.వాటిని సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. ఇకనుండి జూన్ జూలై మాసాలలో శిక్షణ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వివరించారు.
రైతులు పండించిన పంటపై మెళకువలు పాటిస్తే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర దక్కి, సాగు లాభసాటిగా వుంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా పేర్కొన్నారు.శనివారం వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవనాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామ రైతు వేదిక వద్ద మిరప కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏర్పాటుచేసిన రైతు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, పంట పండించిన రైతన్నలు,కోతల సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలని, లేనిచో తాలు అధికంగా వచ్చి, నిల్వలో అఫ్లోటాక్సిన్స్ వల్ల నాణ్యత దెబ్బతినే ప్రమాదం వుందని.ఈ సమస్యలను అధిగమించి, నాణ్యమైన దిగుబడులు,అధిక ధర పొందాలంటే కోతలు, అనంతరం కాయలు ఆరబెట్టే సమయంలో కూడా శాస్ర్తీయ విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు.
మిరప పంట సాగు చేసిన రైతులు పంట కోత తరువాత ఎండలో ఆరబెట్టి నాన తాప రవాణా ప్రకారం కాల పరిమాణం రంగు ఆధారంగా గ్రీటింగ్ చేసుకొని వేరువేరుగా మార్కెట్లకు తీసుకెళ్లడం ద్వారా అధిక ధరలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.రైతులు వాడే క్రిమిసంహారక మందుల విషయంలో వ్యవసాయ శాఖ తో పాటు ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు పాటించడం ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి ప్రమాణాలు గల మిరప వంటను పండించవచ్చునని, ఉద్యాన శాఖ అధికారులు ఈ ఉద్యాన పంటలు సాగు చేయు రైతులకు ఎప్పటికపుడు సూచనలు మరియు సలహాలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గాని లేదా యూట్యూబ్ల ద్వారా గాని నేరుగా రైతులు మొబైల్ కి పంపించాలని కలెక్టర్ సూచించారు.నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మిరప పంట సాగు సీజన్ కంటి ముందు జూన్ జూలై మాసాలలో ఏర్పాటు చేయడం వలన రైతులకు పెట్టుబడి భారం తగ్గించడంతోపాటు నాణ్యతమైన దిగుబడులు సాధించి అధిక మార్కెట్ ధరలు పొందే అవకాశం ఉందన్నారు.ఉద్యానవన శాస్త్రవేత్తలు నాగరాజు, వీరన్న పాల్గొని మిరప పంటలో పీడల నివారణ చేపట్టాల్సిన చర్యలపై కూలంకషంగా వివరించారు.

ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో లేరు?

మిర్చి పంటల సాగుపట్ల సలహాలు సూచనల కోసం ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో ఉండడం లేదు వ్యవసాయ శాఖ అధికారులను అడుగుతే నాకు సంబంధం లేదు అని అంటున్నారు అని పలు రైతులు కలెక్టర్ కు విన్నవించుకున్నారు.అలాగే పండించిన పంటను మార్కెట్ కు తీసుకపోతే అక్కడి వ్యాపారులు సిండికేట్ గా మారి ఒకటి రెండు కూట్లకు జెండా పాట పెట్టి మిగతా సరుకును తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని దీంతో తీవ్రస్థాయిలో నష్టపోతున్నామని పలువురు రైతులు కలెక్టర్ వద్ద వాపోయారు. మిరప పంట సాగుపట్ల ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో లేక అవగాహన కల్పించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని సంబంధిత అధికారులను వెంటనే నియమించాలని ఈ సందర్భంగా పలువురు రైతులు కోరారు. మిర్చి పంటలో నల్ల పురుగు సోకడం వల్ల భారీ ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నదని పలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో మిర్చి పంట సాగు శాతం తక్కువ ఉందని అన్నారు. ఉద్యానవన శాఖ అధికారుల కొరత ఉన్నదని తెలిపిన కలెక్టర్ ఉన్నత స్థాయి అధికారుల సహకారంతో అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. మిర్చి పంటలో నల్ల పురుగుల నివారణ కోసం సంబంధిత అధికారుల సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. రైతులు మార్కెట్ లో మిర్చి అమ్మకాలు చేపట్టే సమయంలో జరుగుచున్న పరిణామాల పట్ల పరిశీలించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సత్య శారద తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, ఆర్డిఓ రమాదేవి, మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి నిర్మల, మార్కెటింగ్ ఆధికారి సురేఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి,నర్సంపేట మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్, సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version