ABVP బంద్ విజయవంతం 

తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం

జరిగింది అందులో భాగంగా హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా విద్యా రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ప్రభుత్వ పాఠశాలలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ పేద విద్యార్థులను నాణ్యమైన విద్యకు దూరం చేస్తోందని అన్నారు.

మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని జనవరి మాసంలో అట్టహసంగా ప్రకటించిన ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కనీసం పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేయకపోవడం, నిధులు కొరతతో మౌలిక వసతుల కల్పనలో, మధ్యాహ్న భోజనం అందించడంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ఫీజు దోపిడీ నియంత్రించి “ఫీజు నియంత్రణ చట్టం” అమలు చేస్తామని స్వయంగా విద్యా శాఖ మంత్రి జనవరిలో ప్రకటించినా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడం, ఫీజుల నియంత్రణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు డొనేషన్, బుక్స్, యూనిఫామ్ పేరుతో బహిరంగంగా లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజలను హింసిస్తూ పలు పాఠశాలలు ప్రవేశం రోజు 60% ఫీజు చెల్లిస్తేనే తరగతి అనుమతిస్తామని షరతులు పెడుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహారిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని మండిపడ్డారు.గత ఎనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం సర్కారు బడులను నిర్లక్ష్యం చేస్తూ నియామకాలు చేపట్టకుండా, నిధులు విడుదల చేయకుండా, మౌలిక వసతులు కల్పించకుండా పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థును విద్యకు దూరం చేసే కుట్ర ఒక వైపు చేస్తూ మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ప్రోత్సహిస్తూ అనుమతి లేకపోయినా, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తూ ఒకే పేరుతో వందల బ్రాంచ్ లు నిర్వహించినా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ బహిరంగ దోపిడీకి పాల్పడిన ప్రభుత్వ నియంత్రణ మాత్రం శూన్యమన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పున్నం వేణు ,

నాయకులు అఖిల్ ,బలరాం , సాయి చందు, నిఖిల్ 

జిల్లా కన్వీనర్ ఎర్రగొల్ల ఛత్రపతి శివాజీ , జిల్లా సంఘటనా మంత్రి హర్ష , నాయకులు సుజిత్ ,కుమార్ ,చింటు ,తదితరులు పాల్గొన్నారు

 

డిమాండ్స్:

 

1. సర్కారు బడుల్లో సత్వరమే పుస్తకాలు, డ్రెస్ లు అందించాలి.

 

2. ప్రభుత్వం ప్రకటించిన “మన ఊరు-మన బడి” కార్యక్రమానికి నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలి.

 

3. పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న టీచింగ్, DEO, MEO పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

 

4. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి.

 

5. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించి, ఏక రూప ఫీజు నిర్ణయించాలి. 6. ఒకే పేరుతో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ స్కూళ్లను నిషేధించాలి.

 

7. బుక్స్, డ్రెస్, డొనేషన్ పేరుతో ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్

 

8. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి..

 

9. విద్యా హక్కు చట్టం అమలు చేయాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version